యాప్నగరం

వాజ్‌పేయి హాస్యచతురత.. ఎన్టీఆర్‌పై జోక్!

వాజ్‌పేయి గొప్ప వక్త, మాటకారి అన్నసంగతి మనందరికీ తెలసు. ఆయన తన ప్రసంగాల్లో కవితా పంక్తులను, చమత్కారాలను సందర్భానుసారంగా ఉపయోగించేవారు.

Samayam Telugu 16 Aug 2018, 11:52 pm
వాజ్‌పేయి గొప్ప వక్త, మాటకారి అన్నసంగతి మనందరికీ తెలసు. ఆయన తన ప్రసంగాల్లో కవితా పంక్తులను, చమత్కారాలను సందర్భానుసారంగా వాడేవారు. అయితే... ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ నిర్వహించిన సదస్సుకు వాజ్‌పేయి కూడా హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం భోజన సమయంలో.. అతిథులకు ఎన్టీఆర్ తనదైన శైలిలో బకెట్లో వెన్నతెచ్చి వడ్డిస్తున్నారు. దీని గమనించిన వాజ్‌పేయి.. 'రామారావు సాబ్ నే హమ్ కో మస్కా లగా రహా హై (రామారావుగారు మనకు మస్కా కొడుతున్నారు) అని అనడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. ఈ సంఘటన వాజ్‌పేయి హాస్యచతురతకు అద్దం పడుతోంది.
Samayam Telugu vajpayee-NTR


మరో సందర్భంలో.. భోజనాల సమయంలో 'రైస్' అనే పదానికి తెలుగు పదం ఏంటని వాజ్‌పేయి అడిగారట. దాంతో అన్నం అని అక్కడున్నవారు చెప్పారట. దీనికి సమాధానమిచ్చిన వాజ్‌పేయి.. 'అన్నం' తెలుగు పదం కాదని, అది సంస్కృత పదమని.. తెలుగు పదం మరేదో ఉండి ఉంటుందని అన్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.