యాప్నగరం

వర్ద ధాటికి పది మంది మృతి, కూలిన లక్షలాది వృక్షాలు

వర్ద తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య తమిళనాట పదికి చేరింది.

TNN 13 Dec 2016, 9:04 am
వర్ద తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య తమిళనాట పదికి చేరింది. చెన్నై నగరంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. కాంచీపురం, తిరువళ్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. తుపాను మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. విల్లుపురం, నాగపట్నంలో ఒక్కరు చొప్పున చనిపోయారు. తుపాను కారణంగా లక్షలాది చెట్లు నెలకొరిగాయి. భారీ గాలుల తీవ్రతకు కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో ఎన్డీఆర్ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Samayam Telugu vardah cyclone ten people died in tamilnadu
వర్ద ధాటికి పది మంది మృతి, కూలిన లక్షలాది వృక్షాలు


వర్ద తుపాను కారణంగా చెన్నై, ఎన్నూరు రేవుల్లో తొలిసారిగా పదో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీసిన తీవ్ర గాలుల కారణంగా తమిళనాట భారీగా చెట్లు నేలకొరిగాయి. చెన్నైలోనే ఏకంగా 9 వేల భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర చెట్లు కూలిపోయి ఉంటాయని అంచనా. పునరావాస కేంద్రాల్లో పదకొండు వేల మందికి ఆశ్రయం కల్పించారు. తుపాను విధ్వంసానికి తమిళనాడులో వందల కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులో నేడు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.