యాప్నగరం

నాన్నమ్మ బాటలో రాహుల్..సెంటిమెంట్ వర్కౌటయ్యేనా

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అధ్యక్షుడు రాహుల్ దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంతో పాటూ సెంటిమెంట్‌ను రాహుల్ నమ్ముకుంటున్నారు. నాయనమ్మ ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నారు.

Samayam Telugu 20 Mar 2018, 4:17 pm
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అధ్యక్షుడు రాహుల్ దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంతో పాటూ సెంటిమెంట్‌ను రాహుల్ నమ్ముకుంటున్నారు. నాయనమ్మ ఇందిరా గాంధీ బాటలోనే నడుస్తున్నారు. ఆయన ప్రచారం కోసం మంగళూరు వచ్చారు. అక్కడి నెహ్రూ మైదనాంలో సభలో రాహుల్ ప్రసంగం కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. కాంగ్రెస్ నేతల సలహా మేరకు... వాస్తుల్లో కొన్ని మార్పులు చేశారట. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రసంగించిన చోటే... వేదిక ఏర్పాటయ్యింది.
Samayam Telugu rahul


ప్రధానంగా కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్, వాస్తుల్ని ప్రస్తావిస్తున్నారు. రాహుల్ ఉత్తరంవైపుగా తిరిగి ప్రసంగం చేస్తే అది ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని నేతలు బలంగా నమ్ముతున్నారట. వాస్తవానికి వేదికను పశ్చిమం దిక్కున ఏర్పాటు చేస్తుంటారు. హిందువుల సంప్రదాయం, నమ్మకం ప్రకారం పశ్చిమ దిక్కు అంత మంచిది కాదట... అందుకే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని ఉత్తరంవైపు వేదికను సిద్ధం చేశారు. ఇలా చేస్తే ఎన్నికల్లో విజయంతో పాటూ పార్టీ కూడా కర్ణాటకలో పుంజుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. మరి వాస్తు సెంటిమెంట్‌లు కాంగ్రెస్‌కు ఏమాత్రం కలిసొస్తాయో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాని చెప్పలేం.
Read This Story Also In Karnataka

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.