యాప్నగరం

Jammu Kashmir: బ్రేకులు ఫెయిల్.. నదిలో పడిపోయిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి

జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోయింది. దాంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Aug 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • నదిలోకి దూసుకెళ్లిన వాహనం
  • వాహనంలో ప్రయాణిస్తున్న 39 మంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jawans Vehicle rolls down
జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) పహల్గామ్‌లో భద్రతా బలగాల వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు చనిపోయారు. ఆ బస్సులో ఇండో టిబెటన్ బోర్డర్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ప్రయాణించే సమయంలో బస్సులో మొత్తం 39 మంది ఉన్నారు. బస్సు ఫ్రిస్లాన్ దగ్గర రోడ్డుపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో చాలామందికి గాయాలయ్యాయి. అయితే బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడంతో బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.



"39 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక సివిల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో నదిలో పడిపోయింది. దళాలు చందన్వారి నుంచి పహల్గామ్‌కు వెళ్తున్నాయి" అని ITBP వెల్లడించింది. అనంతనాగ్ జిల్లాలోని చందన్వారి పహల్గామ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, ఆరుగురు ఐటీబీపీ జవాన్లు వీరమరణం పొందారని, పలువురు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు కూడా తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి విమానంలో తరలిస్తున్నామని చెప్పారు.

పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ జవాన్‌‌లు అందరూ అమర్‌నాథ్ యాత్ర విధులు నిర్వర్తించి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో జవాన్ల వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.