యాప్నగరం

బాలు మా ఊరి వ్యక్తి.. చిన్ననాటి నుంచే ప్రత్యేక అనుబంధం: వెంకయ్య నాయుడు

SP Balu Death: పాటల రారాజు ఎస్పీ బాలు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వగ్రామానికి చెందిన వ్యక్తిగా బాలుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Samayam Telugu 25 Sep 2020, 7:15 pm
గాన గంధర్వుడు ఎస్పీ బాలు మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతం ఓ అద్భుతమైన స్వరాన్ని కోల్పోయిందన్నారు. సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. అభిమానులు ఆయణ్ని ‘పాటలు పాడే చంద్రుడి’గా పిలుచుకుంటారని పేర్కొన్నారు.
Samayam Telugu ఎస్పీ బాలసుబ్రమణ్యం
SP Balasubrahmanyam


పద్మ భూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులను బాలసుబ్రహ్మణ్యం సొంతం చేసుకున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేశారు. బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

బాలు అస్తమయంతో సాంస్కృతిక ప్రపంచం చాలా పేదదైపోయింది. దేశంలోని ప్రతి ఇంటికీ పరిచయమైన పేరు ఆయనది. ఆయన శ్రావ్యమైన స్వరం, సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ


సంగీత ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటని ప్రధాని పేర్కొన్నారు. బాలు స్వరం దశాబ్దాలుగా దేశంలో ఇంటింటా అలరించిందని గుర్తు చేశారు. సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవలను గుర్తుచేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.

Also Read: సంగీత ప్రపంచం నిరుపేదదైంది.. ప్రధాని మోదీ భావోద్వేగం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.