యాప్నగరం

విజయంపై ధీమా వ్యక్తంచేసిన వెంకయ్య నాయుడు

ఇవాళ జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకయ్య నాయుడు తన గెలుపుపై ధీమా...

TNN 5 Aug 2017, 2:46 pm
మాజీ కేంద్ర మంత్రి, ఇవాళ జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకయ్య నాయుడు తన గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమవడానికన్నా ముందే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తనకి అన్ని పార్టీల మద్దతు వుందని అన్నారు. తాను మాత్రమే లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు అందరికీ మర్యాదపూర్వకంగా లేఖలు రాశానని, అందరి నుంచి సానుకూలమైన స్పందన లభించిందని మీడియాకు తెలిపారు. అన్నింటికిమించి తాను ఇతర పార్టీలకి వ్యతిరేకంగానో లేక వ్యక్తులకి వ్యతిరేకంగానో పోటీ చేయడం లేదని వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు.
Samayam Telugu venkaiah naidu confident about his victory
విజయంపై ధీమా వ్యక్తంచేసిన వెంకయ్య నాయుడు


ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుండగా 5 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవనుంది. రాత్రి 7 గంటలకల్లా ఫలితం కూడా తేలిపోనుంది. ఎన్డీఏ తరపున వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలవగా యూపీఏ తరపున గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.