యాప్నగరం

క్రైస్తవ మందిరాలపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు

క్రైస్తవ ప్రార్ధనా మందిరాల (చర్చీలు)పై కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 13 Apr 2017, 5:29 pm
క్రైస్తవ ప్రార్ధనా మందిరాల (చర్చీలు)పై కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు చర్చీలు దూరంగా ఉండాలని ఆయన గురువారం కేరళలో వ్యాఖ్యానించారు.
Samayam Telugu venkaiah naidu says church should away from politics
క్రైస్తవ మందిరాలపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు


‘‘చర్చీలు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టాలి. రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు’’ అని వెంకయ్య అన్నారు.

కేరళలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఖాతా తెరవలేదు.

2014 ఎన్నికల్లో రెండో స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాలపై దృష్టి సారించామని చెప్పిన వెంకయ్య.. బీజేపీలోకి అందరికి ఆహ్వానం ఉంటుందన్నారు.

కేరళలో బీజేపీ పుంజుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.