యాప్నగరం

మీడియా నుంచి వెంకయ్య కోరేది అదే..!

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేసేవాడిని. అయినా ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటలేదు..

TNN 12 Aug 2017, 7:36 pm
సభలో జరిగే నిర్మాణాత్మక చర్చలకు ప్రసార మాధ్యమాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని వెంకయ్య సూచించారు. అధ్యక్ష హోదాలో శుక్రవారం (ఆగస్టు 11) ఆయన రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తు మీడియా కేవలం సంచలనాలు, వివాదాలు, నాటకీయతకే ప్రాధాన్యం ఇస్తోంది. నేను ఇదివరకు ఇదే సభలో వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి 52 నిమిషాల పాటు మాట్లాడా. సభలోని వారంతా నన్ను అభినందించారు. మరుసటి రోజు చూస్తే ఏ పేపర్‌లోనూ ఇది రాలేదు. ఒక్క పేపర్‌లో మాత్రం వెంకయ్యనాయుడు వ్యవసాయంపై మాట్లాడారు అని రాశారు. ఇలాంటి పద్ధతిని వీడి మీడియా తన పవిత్రమైన బాధ్యత నిర్వర్తించాలి.’ అని వెంకయ్య పేర్కొన్నారు.
Samayam Telugu venkaiah naidu tells media as rajya sabha chairman
మీడియా నుంచి వెంకయ్య కోరేది అదే..!


‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేసేవాడిని. అయినా ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటలేదు. ప్రతిపక్షంలో సాగిన సమయమే నా జీవితంలో అత్యుత్తమ భాగం’ అని వెంకయ్య అన్నారు. తనపై విశ్వాసం ఉంచి గురుతర బాధ్యతలు అప్పగించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

‘ఇక మీదట నేను అన్ని పార్టీల వ్యక్తిని. నిష్పక్షపాతంగా పనిచేస్తా. భారత్‌ ముందుకెళుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలను యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా మన పనితీరు ఉండాలి’ అని వెంకయ్య పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.