యాప్నగరం

దాడులపై అమెరికా కఠినంగా వ్యవహరించాలి

అమెరికాలో ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపై కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు.

Samayam Telugu 26 Feb 2017, 1:44 pm
అమెరికాలో ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపై కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. జాతి విద్వేషాలు రెచ్చగొడుతూ దాడులు చేస్తున్న వారి పట్ల అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని ఆయన అన్నారు.
Samayam Telugu venkaiah urges to us to act firmly on killings
దాడులపై అమెరికా కఠినంగా వ్యవహరించాలి


శ్వేతజాతియుడి చేతిలో బలైన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

‘‘అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలతో పాటు ఇతరులు శాంతిని నెలకొల్పాలని కోరుతున్నా. దాడులకు పాల్పడే నిందితులపై శిక్షించడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని అమెరికాను కోరుతున్నా’’ అని వెంకయ్య అన్నారు.

కాగా, తెల్లజాతీయుడు అడమ్ ప్యూరింటన్ చేతిలో బలైన శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేర్చనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.