యాప్నగరం

సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ ఇకలేరు

సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ మాజీ సభ్యుడు కుల్దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు.

Samayam Telugu 23 Aug 2018, 9:27 am
సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ మాజీ సభ్యుడు కుల్దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోధీ రోడ్డులో ఉన్న శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. నయ్యర్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమిషనర్‌గానూ పని చేశారు. బ్రిటిష్ ఇండియాలోని సియాల్ కోట్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)‌లో 1923 ఆగష్టు 14న ఆయన జన్మించారు.
Samayam Telugu kuldeep nayar


ఉర్దూ ప్రెస్ రిపోర్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన నయ్యర్ ఇంగ్లిష్ పత్రిక ది స్టేట్స్‌మన్ ఢిల్లీ ఎడిషన్ ఎడిటర్‌గా పని చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఆయన అరెస్టయ్యారు. దేశవిదేశాల్లోని ప్రముఖ పత్రికల్లో ఆయన కాలమ్స్ రాశారు. శాంతి కాముకుడిగా, మానవ హక్కుల కార్యకర్తగా, రచయితగానూ ఆయన గుర్తింపు పొందారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో కుల్దీప్ నయ్యర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎమర్జెన్సీ రీటోల్డ్ అనే పుస్తకంలో ఎమర్జెన్సీ విధించడానికి అసలు కారణాలను ఆయన వివరించారు. నాగార్జున యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.