యాప్నగరం

రాష్ట్రపతి ఎన్నికలకు కీలకం కానున్న యూపీ గెలుపు

ప్రధాని నరేంద్రమోడీ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు.

TNN 11 Mar 2017, 6:57 pm
ప్రధాని నరేంద్రమోడీ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలుపుతీరాలకు చేర్చడంతో పార్టీలోనే కాకుండా.. దేశంలోనూ ఆయన ప్రతిష్ట మరింత పెరిగింది. బలమైన నాయకుడిగా ఎదగడంతో అంతర్జాతీయంగానూ ఆయన ప్రతిష్ట మరింత పెరగనుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి లాంటి అతిరథ మహారథులు ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ పాగా వేయడం వెనుక మోడీ కీలక పాత్ర పోషించారు.
Samayam Telugu victory in up becomes favourable for bjp in presidential elections
రాష్ట్రపతి ఎన్నికలకు కీలకం కానున్న యూపీ గెలుపు


ఈ విజయంతో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి అనేక సానుకూలతలు కలగనున్నాయి. ఇప్పటివరకూ బీజీపీ.. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ.. రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో వివిధ బిల్లులు ఆమోదం పొందే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా యూపీ, ఉత్తరాఖండ్‌లో జయకేతనం ఎగరవేసిన భాజపాకు త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బలం బాగా పెరగనుంది. అంతేకాకుండా.. త్వరలో నిర్వహించనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ స్పష్టమైన పాత్ర పోషించే అవకాశం లభించింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆధిక్యం సాధించడానికి రాష్ట్రాల శాసనసభ్యుల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభా ఆధారంగా ఎమ్మెల్యే ఓటు విలువను లెక్కిస్తారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. తాజా ఎన్నికల్లో యూపీలో 325 సీట్లు సాధించిన బీజేపీకి ఇది బాగా కలిసిరానుంది. తద్వారా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.