యాప్నగరం

కర్ణాటకం: మమతా తొలి ట్వీట్.. ‘ప్రాంతీయ’ హింట్!

రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండాలంటూ పిలుపిచ్చిన మమతా బెనర్జీ.. కర్ణాటక పరిణామాలపైనా దృష్టి పెట్టారు.

Samayam Telugu 19 May 2018, 5:24 pm
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండాలంటూ పిలుపిచ్చిన మమతా బెనర్జీ.. కర్ణాటక పరిణామాలపైనా దృష్టి పెట్టారు. శనివారం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ - జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమిల బలపరీక్ష నేపథ్యంలో ఆమె ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగానే ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Samayam Telugu asda


బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసి జేడీ(ఎస్)-కాంగ్రెస్‌లకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అధికారం ఇచ్చిన నేపథ్యంలో మమతా వెంటనే తమ స్పందన వ్యక్తం చేశారు. అందరికంటే ముందుగా జేడీ(ఎస్) కూటమిని ఆమె అభినందించారు. జేడీఎస్‌కు అందిన తొలి అభినందన ట్వీట్ ఆమెదే కావడం విశేషం.

‘‘ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటకకు శుభాకాంక్షలు. దేవే గౌడ, కుమార స్వామి, కాంగ్రెస్ తదితరులకు ఇవే నా అభినందనలు. ఇది ‘ప్రాంతీయ’ కూటమి (రీజనల్ ఫ్రంట్) విజయం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆమె ‘రీజనల్’ ఫ్రంట్‌ను కోడ్ చేయడాన్ని చూస్తుంటే.. త్వరలో కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు కానున్న ప్రాంతీయ పార్టీల కూటమికి సంకేతం కావచ్చని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.