యాప్నగరం

ప్లీజ్, రక్షించండి: ఇంట్లో.. పీకల్లోతు నీటిలో బందీ!

కేరళ వరదల్లో చిక్కుకున్న ప్రజల కష్టాలివి. ఎక్కడ చూసినా పీకల్లోతు నీరు. కరెంటు లేదు, ఆహారం లేదు. పిల్లలతో చిమ్మ చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి.

Samayam Telugu 18 Aug 2018, 9:03 pm
కేరళ వరదల్లో చిక్కుకున్న ప్రజల కష్టాలివి. ఎక్కడ చూసినా పీకల్లోతు నీరు. కరెంటు లేదు, ఆహారం లేదు. పిల్లలతో చిమ్మ చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇలా ఇళ్లల్లో బందీలైన బాధితులు సోషల్ మీడియా ద్వారా తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. తమని రక్షించాలంటూ తమ ఆప్తులకు వీడియో సందేశాలు పంపుతున్నారు.
Samayam Telugu cgbmkawvjn-1534416618.


ఈ కింది వీడియోలో ఉన్న వ్యక్తి మొదటి అంతస్తులో పీకలలోతుకు చేరింది. దీంతో, ఆ వ్యక్తి ఇంట్లోనే బందీ అయ్యాడు. మరో మార్గం లేక ఆయన సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ‘‘ఇది మా ఇంటి లోపలి పరిస్థితి. నీరు క్రమేనా పెరుగుతోంది. రెండో అంతస్తు కూడా మునిగిపోయేలా ఉంది. బయటకు వెళ్లేందుకు దారి లేదు. చాలామందిని సాయం చేయాలని కోరాను. చివరికి మా ఎమ్మెల్యేకు కూడా నా పరిస్థితి చెప్పా. వారు నన్ను రక్షిస్తారని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. మరో కుటుంబం కూడా ఇదేవిధంగా ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 10 మంది కుటుంబ సభ్యులు తమని రక్షించాలంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. వారి ఆవేదనను ఈ వీడియోలో చూడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.