యాప్నగరం

భారీ అగ్నిప్రమాదం.. సిబ్బందిపై కూలిన శ్లాబ్

ముంబయిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ట్ ప్రాంతంలోని పటేల్‌ ఛాంబర్స్‌లో తెల్లవారుజాము 4.30గంటలకు మంటలు ఎగిసిపడ్డాయి.

Samayam Telugu 9 Jun 2018, 11:25 am
ముంబయిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ట్ ప్రాంతంలోని పటేల్‌ ఛాంబర్స్‌లో తెల్లవారుజాము 4.30గంటలకు మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, మంటలు తీవ్రంగా ఉండటంతో అదుపు చేయడం కష్టంగా మారింది. భవనం కూడా పాక్షికంగా కూలింది.
Samayam Telugu images


18 అగ్నిమాపక శకటాలతో150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఆర్పడానికి భవనంలోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిపై శ్లాబ్ కూలడంతో ఇద్దరు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం గత నాలుగేళ్లుగా ఖాళీగానే ఉంది. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.