యాప్నగరం

పద్మావత్: స్కూల్ బస్సుపై రాళ్ల దాడి

చిన్న పిల్లల బస్సుపై దాడి ఘటన మీకు సిగ్గు అనిపించడం లేదా? మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారి ప్రాణాలను ఫణంగా పెడతారా? : ప్రకాష్ రాజ్

TNN 25 Jan 2018, 8:31 pm
ప్పటిలాగానే బస్సులో స్కూల్‌కు వెళ్తున్నా ఆ చిన్నారులకు ఎదురైన భయానక అనుభవం ఇది. ‘పద్మావత్’ సినిమాపై నిరసనలు చేస్తున్న ఆందోళనకారుల మూర్ఖత్వానికి ప్రతీకగా నిలిచే ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్‌లో చోటు చేసుకుంది. బుధవారం విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూలు బస్సుపై కర్నీ సేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు పగిలి, లోపల ఉన్న విద్యార్థుల, టీచర్ల మీద పడ్డాయి. ఆకస్మిక పరిణామానికి విద్యార్థులు హడలిపోయారు.
Samayam Telugu video padmaavat mob attack on gurgaon school bus
పద్మావత్: స్కూల్ బస్సుపై రాళ్ల దాడి


కొంతమంది చిన్నారులు భయంతో ఏడ్చారు. టీచర్లు వారిని అక్కున చేర్చుకుని, ధైర్యం చెబుతూ బస్సును సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, జరగకూడనది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఒక సినిమాపై ఆందోళన కోసం విద్యార్థులనే బలి తీసుకునేంత మూర్ఖత్వంలో రాజకీయ పార్టీలు ఉన్నాయా? అంటూ సోషల్ మీడియా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

బాలీవుడ్ నటుడు ఫర్హన్ అక్తర్ ఈ ఘటనపై స్పందిస్తూ... ‘‘స్కూల్ బస్సుపై దాడి చేయడం ఆందోళన కాదు. అది ఉగ్రవాదం. ఆ దాడి చేసిన వ్యక్తులు ఉగ్రవాదులతో సమానం’’ అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘‘మన దేశ చిన్నారులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఏడ్చారు. కర్నీ సేన బస్సుపై చేసిన దాడిపై స్పందించాల్సిన ప్రభుత్వం మరో మార్గం చూసుకుంది. ప్రతిపక్ష పార్టీ వ్యూహాత్మకంగా స్పందించింది. చిన్న పిల్లల బస్సుపై దాడి ఘటన మీకు సిగ్గు అనిపించడం లేదా? మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారి ప్రాణాలను ఫణంగా పెడతారా?’’ అంటూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.