యాప్నగరం

హృదయ విదారకం: మట్టిలో చిన్నారి మృతదేహం

కేరళ వరదలు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 385 మంది చనిపోగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Samayam Telugu 18 Aug 2018, 8:21 pm
కేరళ వరదలు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 385 మంది చనిపోగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో గల్లంతైనవారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కేరళలోని దిగువ ప్రాంతాల్లోనే కాకుండా కేరళాలోని పర్వత ప్రాంతాల్లో కూడా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Samayam Telugu Untitled1aల


ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజా ఘటనలో ఓ చిన్నారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక సిబ్బంది అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బురదలో కూరుకుపోయిన ఆ చిన్నారి ఊపిరి ఆడక చనిపోయాడు. గుండెలు బరవెక్కించే ఇలాంటి విషాద ఘటనలు మరెన్నో కేరళాలో చోటు చేసుకుంటున్నాయి.
మట్టిపెళ్లల నుంచి చిన్నారిని వెలికి తీస్తున్న వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.