చెన్నై: సి.హెచ్. విద్యాసాగర్ రావును తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో రోశయ్య పదవీ కాలం ముగుస్తుంది. రోశయ్య కాంగ్రెస్ అభ్యర్ధి అయినందున ఆయన పదవీ కాలం పొడిగించేందుకు కేంద్రం సముఖంగా లేదు. దీంతో ఆయన స్థానంలో విద్యాసాగర్ రావును నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయి గవర్నర్ గా మరికొన్ని రోజుల్లో రాజీనామా చేయనున్న గుజరాత్ సీఎం ఆనందీ బెన్ కు అప్పగిచే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోశయ్య ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేత ఆ పదవికి రాజీనామా చేయించిన యూపీఏ సర్కార్.. తమిళనాడు గవర్నర్ గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోశయ్య తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ వచ్చారు.
తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తమినాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు
TNN 31 Aug 2016, 5:33 pm