అసోంలో అగ్గి రాజుకుంది. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఏకంగా పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. నాగావ్ జిల్లాలోని బటద్రవ నియోజక వర్గంలో శనివారం ఒక వ్యక్తి కస్టడీలో మరణించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. జనం గుంపుగా పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారు. అనంతరం స్టేషన్కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఒక ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మరికొంతమందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ధింగ్లోని సల్నాబరీకి చెందిన సఫీకుల్ ఇస్లాంను పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలా తీసుకెళ్లిన సఫీకుల్ ఇస్లాంను నాగావ్ సివిల్ ఆస్పత్రిలోని మార్చురీలో నిర్జీవంగా కనిపించాడు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సఫీకుల్ ఇస్లాం మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శనివారం బాటద్రవ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. మృతదేహంతోపాటు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు.
సఫీకుల్ మరణవార్త సల్నాబరి ప్రాంతంలో వ్యాపించడంతో, కోపోద్రిక్తులైన వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. పోలీసులను పట్టుకుని బాగా కొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు. 10 వేల రూపాయల నగదు, బాతు ఇవ్వకపోవడంతో సఫీకుల్ను పోలీసులు కొట్టారని దాంతో అతడు మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు. ఈ దాడిలో కొంతమంది పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు నాగావ్ పోలీసులు తెలిపారు.
కాగా గత ఏడాది జూన్లో అసోంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు కూడా నాగోన్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. దాడి చేశారు. దాంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. రూపహిహత్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దాంతో అప్పుడు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ గరేకి అనే గ్రామంలో అక్రమ బెట్టింగ్లపై పోలీసులు దాడి చేయగా.. కొంతమంది పరుగులు తీశారు. వారిలో ఒకరు నీటికుంటలో పడి మృతి చెందారు. దాంతో ప్రజలు ఆగ్రహించారు.
సఫీకుల్ మరణవార్త సల్నాబరి ప్రాంతంలో వ్యాపించడంతో, కోపోద్రిక్తులైన వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. పోలీసులను పట్టుకుని బాగా కొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు. 10 వేల రూపాయల నగదు, బాతు ఇవ్వకపోవడంతో సఫీకుల్ను పోలీసులు కొట్టారని దాంతో అతడు మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు. ఈ దాడిలో కొంతమంది పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు నాగావ్ పోలీసులు తెలిపారు.
కాగా గత ఏడాది జూన్లో అసోంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు కూడా నాగోన్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. దాడి చేశారు. దాంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. రూపహిహత్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దాంతో అప్పుడు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ గరేకి అనే గ్రామంలో అక్రమ బెట్టింగ్లపై పోలీసులు దాడి చేయగా.. కొంతమంది పరుగులు తీశారు. వారిలో ఒకరు నీటికుంటలో పడి మృతి చెందారు. దాంతో ప్రజలు ఆగ్రహించారు.