యాప్నగరం

శశికళ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

Bengaluru: శశికళ నటరాజన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. కరోనా వైరస్ బారినపడ్డ శశికళ బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Samayam Telugu 23 Jan 2021, 12:07 am
మిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె సాధారణ స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం (జనవరి 22) రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ బారినపడిన శశికళ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఆరోగ్య క్షీణించినట్లు వార్తలు వచ్చాయి.
Samayam Telugu శశికళ
Sasikala health update


శశికళకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జ్వరం, వెన్నునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు శుక్రవారం ఉదయం తెలిపారు. సాయంత్రానికి ఆమె కోలుకున్నారని.. రక్తపోటు, శ్వాస వేగం, గుండె పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నాయని వైద్యులు తెలిపారు.

హెల్త బులెటిన్


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ.. ప్రస్తుతం పరప్పన జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షా కాలం పూర్తి చేసుకొని జనవరి 27న విడుదల కానున్నారు. తమిళనాడు అసెంబ్లీకి మరో 3 నెలల్లోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన రాజకీయ పునరాగమనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.