ఆమె చాలా సాధారమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కిలోమీటరు దూరంలో ఉన్న కాలేజీకి రోజూ సైకిల్పై వెళ్లి, మధ్యాహ్నం కల్లా తిరిగొచ్చేది. మార్గమధ్యలో ఎవరైనా తెలిసిన వారు ఎదురైతే చిరునవ్వే సమాధానం. తెలిసిన వాళ్లందరూ చెప్పే మాట ‘ఆమె చాలా సిగ్గరి’. ఇదంతా నాలుగేళ్ల కిందటి మాట. అలాంటి అమ్మాయి ఉన్నట్టుండీ ఒక రోజు కనిపించకుండా పోయింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో పోలీసులు చేతికి చిక్కడంతో మళ్లీ తెరపైకి వమచ్చింది.
ప్రగ్యా దేవ్నాథ్(25)గా వెళ్లిన ఆమె అయేషా జన్నత్ మొహనాగా తిరిగొచ్చింది. ఆమె అరెస్టైన కారణం విని బెంగాల్లోని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు షాక్ తిన్నారు. ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్- ముజాహిదీన్కు ప్రధాన ప్రచారకర్తగా పనిచేస్తున్న ఆ యువతి.. ఆ సంస్థలోకి పలువురు యువతీ యువకలను రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తల్లి స్పందించిన తీరు దేశవాసులతో ప్రశంసలు కురిపిస్తోంది.
Breaking News: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్
పశ్చిమ బెంగాల్ హుగ్లీ ధానియఖాలి గ్రామానికి చెందిన ప్రగ్యా దేబ్నాథ్ నాలుగేళ్ల కిందట 2016 సెప్టెంబర్ 25 ఉదయం ఎప్పటిలాగే ఇంట్లోంచి వెళ్లి ఇక తిరిగి రాలేదు. ఆ సమయంలో బెంగాల్లో దుర్గామాత నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. రోజూ ప్రగ్యా అలా బయటకు వెళ్లడం సాధారణమే. దీంతో తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానం కలగలేదు. గంటలు గడుస్తున్నా ప్రగ్యా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారిలో ఆందోళన పెరిగింది.
ప్రగ్యా తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2 రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రగ్యా తల్లికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ప్రగ్యానే. తాను ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నానని.. ఇస్లాంలోకి మారానని.. తల్లి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశానని ప్రగ్యా చెప్పింది. అంతేకాదు, అదే తన చివరి కాల్ అని కూడా చెప్పింది.
ప్రగ్యా తల్లి వెంటనే పోలీసుల వద్దకు పరుగెత్తుకెళ్లి ఆ వివరాలు చెప్పింది. కానీ, వారు ఆ నంబర్ను ట్రేస్ చేయలేకపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శుక్రవారం (జులై 17) కౌంటర్ టెర్రరిజమ్ అండ్ ట్రాన్స్మిషనల్ క్రైమ్ యూనిట్ పోలీసులు ఢాకాలో ప్రగ్యాను అరెస్ట్ చేశారు. దీని గురించి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. బెంగాల్లోని ధనియాఖాలి ప్రాంతానికి చెందిన యువతి.. ఉగ్రవాద సంస్థలో చేరింది అని వార్తల సారాంశం. ఆ వార్తలు ప్రగ్యా తల్లి చెవిన పడటంతో ఆత్రుతగా చూసింది. ఆమె అనుమానమే నిజమైంది. ఆమె నాలుగేళ్ల కిందట తన ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రగ్యానే.
‘ఇంటి నుంచి వెళ్లడానికి ముందు నా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి తేడాను మేం గమనించలేదు. ఏనాడు మాకు ఎదురుతిరగడం కూడా జరగలేదు. అలాంటిది ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరింది’ అని ప్రగ్యా తల్లి తెలిపారు.
‘ప్రగ్యా చాలా సాధారణమైన అమ్మాయి. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. చాలా సిగ్గరి. అలాంటి అమ్మాయి ఉగ్రవాదిగా మారిందంటే నమ్మబుద్ధి కావడం లేదు’ అని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. బెంగాల్లో ఇది రెండో ఘటనగా అధికారులు చెబుతున్నారు.
లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్న 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఓ యువతిని అరెస్టు చేసిన 3 నెలల తర్వాత ప్రగ్యా విషయం తెలిసింది. 2009లో కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ప్రగ్యా.. ఇస్లాం పట్ల ఆకర్షితమైనట్లు దర్యాప్తులో తేలింది. ఒక మిత్రురాలి ప్రభావంతో ఆమె ఇస్లాంలో చేరి ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలైనట్లు వెల్లడైంది. అనంతరం ఆమె అస్మాని ఖాతున్ అనే మహిళతో కాంటాక్ట్లోకి వెళ్లిపోయింది. జేబీఎం గ్రూపు మహిళా యూత్ వింగ్కు 2016 నుంచి ఆమె చీఫ్గా పనిచేస్తోంది. ఆమెను కొద్ది నెలల కిందట పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి ఆ బాధ్యతలను ప్రగ్యా నిర్వహిస్తోంది.
తన కుమార్తెపై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నామని.. ఇక ఎప్పటికీ కనిపించదని అనుకున్నామని ప్రగ్యా తల్లి తెలిపారు. దేశ విద్రోహ చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డ తన కుమార్తెను చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులను ఆమె కోరారు. ఆ తల్లి పేరు గీత.
Also Read: ఢిల్లీలో పాప.. లేహ్లో తల్లి.. విమానంలో తల్లిపాలు, అంతా మానవత్వమే
Must Read: చివరి నిమిషంలో చావు నుంచి తప్పించిన ఫోటో!
Don't Miss: నా ఇంటర్ మార్కులు చూడండి.. ఓ ఐఏఎస్ ట్వీట్, పేరెంట్స్కు పాఠం
ప్రగ్యా దేవ్నాథ్(25)గా వెళ్లిన ఆమె అయేషా జన్నత్ మొహనాగా తిరిగొచ్చింది. ఆమె అరెస్టైన కారణం విని బెంగాల్లోని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు షాక్ తిన్నారు. ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్- ముజాహిదీన్కు ప్రధాన ప్రచారకర్తగా పనిచేస్తున్న ఆ యువతి.. ఆ సంస్థలోకి పలువురు యువతీ యువకలను రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తల్లి స్పందించిన తీరు దేశవాసులతో ప్రశంసలు కురిపిస్తోంది.
Breaking News: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్
పశ్చిమ బెంగాల్ హుగ్లీ ధానియఖాలి గ్రామానికి చెందిన ప్రగ్యా దేబ్నాథ్ నాలుగేళ్ల కిందట 2016 సెప్టెంబర్ 25 ఉదయం ఎప్పటిలాగే ఇంట్లోంచి వెళ్లి ఇక తిరిగి రాలేదు. ఆ సమయంలో బెంగాల్లో దుర్గామాత నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. రోజూ ప్రగ్యా అలా బయటకు వెళ్లడం సాధారణమే. దీంతో తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానం కలగలేదు. గంటలు గడుస్తున్నా ప్రగ్యా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారిలో ఆందోళన పెరిగింది.
ప్రగ్యా తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు చుట్టుపక్కల గాలించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2 రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రగ్యా తల్లికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ప్రగ్యానే. తాను ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నానని.. ఇస్లాంలోకి మారానని.. తల్లి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశానని ప్రగ్యా చెప్పింది. అంతేకాదు, అదే తన చివరి కాల్ అని కూడా చెప్పింది.
ప్రగ్యా తల్లి వెంటనే పోలీసుల వద్దకు పరుగెత్తుకెళ్లి ఆ వివరాలు చెప్పింది. కానీ, వారు ఆ నంబర్ను ట్రేస్ చేయలేకపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శుక్రవారం (జులై 17) కౌంటర్ టెర్రరిజమ్ అండ్ ట్రాన్స్మిషనల్ క్రైమ్ యూనిట్ పోలీసులు ఢాకాలో ప్రగ్యాను అరెస్ట్ చేశారు. దీని గురించి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. బెంగాల్లోని ధనియాఖాలి ప్రాంతానికి చెందిన యువతి.. ఉగ్రవాద సంస్థలో చేరింది అని వార్తల సారాంశం. ఆ వార్తలు ప్రగ్యా తల్లి చెవిన పడటంతో ఆత్రుతగా చూసింది. ఆమె అనుమానమే నిజమైంది. ఆమె నాలుగేళ్ల కిందట తన ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రగ్యానే.
‘ఇంటి నుంచి వెళ్లడానికి ముందు నా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి తేడాను మేం గమనించలేదు. ఏనాడు మాకు ఎదురుతిరగడం కూడా జరగలేదు. అలాంటిది ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరింది’ అని ప్రగ్యా తల్లి తెలిపారు.
‘ప్రగ్యా చాలా సాధారణమైన అమ్మాయి. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. చాలా సిగ్గరి. అలాంటి అమ్మాయి ఉగ్రవాదిగా మారిందంటే నమ్మబుద్ధి కావడం లేదు’ అని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. బెంగాల్లో ఇది రెండో ఘటనగా అధికారులు చెబుతున్నారు.
లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్న 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఓ యువతిని అరెస్టు చేసిన 3 నెలల తర్వాత ప్రగ్యా విషయం తెలిసింది. 2009లో కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ప్రగ్యా.. ఇస్లాం పట్ల ఆకర్షితమైనట్లు దర్యాప్తులో తేలింది. ఒక మిత్రురాలి ప్రభావంతో ఆమె ఇస్లాంలో చేరి ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలైనట్లు వెల్లడైంది. అనంతరం ఆమె అస్మాని ఖాతున్ అనే మహిళతో కాంటాక్ట్లోకి వెళ్లిపోయింది. జేబీఎం గ్రూపు మహిళా యూత్ వింగ్కు 2016 నుంచి ఆమె చీఫ్గా పనిచేస్తోంది. ఆమెను కొద్ది నెలల కిందట పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి ఆ బాధ్యతలను ప్రగ్యా నిర్వహిస్తోంది.
తన కుమార్తెపై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నామని.. ఇక ఎప్పటికీ కనిపించదని అనుకున్నామని ప్రగ్యా తల్లి తెలిపారు. దేశ విద్రోహ చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డ తన కుమార్తెను చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులను ఆమె కోరారు. ఆ తల్లి పేరు గీత.
Also Read: ఢిల్లీలో పాప.. లేహ్లో తల్లి.. విమానంలో తల్లిపాలు, అంతా మానవత్వమే
Must Read: చివరి నిమిషంలో చావు నుంచి తప్పించిన ఫోటో!
Don't Miss: నా ఇంటర్ మార్కులు చూడండి.. ఓ ఐఏఎస్ ట్వీట్, పేరెంట్స్కు పాఠం