యాప్నగరం

వారణాసి: గంగా హారతిలో పాల్గొన్న ఆర్మీ చీఫ్

సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌ వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్నారు. అనంతరం కాశీ విశ్వనాథుణ్ని దర్శించుకున్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు సురక్షితంగా ఉండాలని పరమశివుడ్ని వేడుకున్నట్లు ఆయన చెప్పారు.

TNN 10 Nov 2017, 9:18 pm
సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌ వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్నారు. అనంతరం కాశీ విశ్వనాథుణ్ని దర్శించుకున్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు సురక్షితంగా ఉండాలని పరమశివుడ్ని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు ఆధునిక ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోందని రావత్ తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానం, భద్రతా దళాల ఉమ్మడి కృషివల్ల జమ్ముకశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఘటనలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
Samayam Telugu watch army chief attends ganga aarti in varanasi
వారణాసి: గంగా హారతిలో పాల్గొన్న ఆర్మీ చీఫ్


తొలి ఆర్మీ కమాండర్‌ ఇన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ గరియప్పకు భారతరత్న ఇవ్వాలనే తన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకారమేనని రావత్ తెలిపారు. 9వ గూర్ఖా ఆఫ్‌ ఫైన్‌ రిబైల్స్‌ రెజిమెంట్‌ ఏర్పడి 200 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 39వ గూర్ఖా రెజిమెంట్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించడానికి ఆయన శుక్రవారం (నవంబర్ 10) వారణాసి విచ్చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.