యాప్నగరం

ప్రధానిపై వేలెత్తితే.. ఆ వేలు నరికేయండి!

వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి చెందిన మరో నేత వార్తల్లోకెక్కారు. బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద్ రాయ్.. ‘ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా వేలెత్తి చూపితే.. ఆ వేలును నరికేయాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యానంద్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

TNN 21 Nov 2017, 6:25 pm
వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి చెందిన మరో నేత వార్తల్లోకెక్కారు. బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద్ రాయ్.. ‘ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా వేలెత్తి చూపితే.. ఆ వేలును నరికేయాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యానంద్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు.
Samayam Telugu watch bihar bjp chief nityanand rais controversial comment
ప్రధానిపై వేలెత్తితే.. ఆ వేలు నరికేయండి!


‘దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని, పేదరికాన్ని ప్రధాని మోదీ నిర్మూలించారు. పేదరికం, ఆత్మాభిమానంపై ఎవరైనా వేలెత్తి చూపిస్తే.. అది ప్రధానికి వ్యతిరేకంగా చేసినట్లే. అలా ఎవరైనా చేస్తే.. ఆ వేలును విరగొట్టాలి. అవసరమైతే నరికేయాలి’ అని నిత్యానంద్ రాయ్‌ అన్నారు.

నిత్యానంద్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్నా.. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. తన మాటలు సరిగా అర్థం కాకపోతే అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ‘ప్రజలను సమాధి చేస్తానని కొంత మంది బెదిరిస్తున్నారు. అంతకంటే ఘోరంగా నేనేం మాట్లాడలేదు కదా..’ అని రాయ్‌ అన్నారు.

కొంత మంది నేతల చేష్టలు ఇప్పటికే బీజేపీకి తలనొప్పిగా మారగా.. తాజాగా రాయ్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. పద్మావతి సినిమా వివాదం నేపథ్యంలో.. ఎవరైనా హీరోయిన్ దీపిక తల నరికి తెస్తే.. వారికి రూ. 10 కోట్లిస్తా అంటూ హరియాణాకు చెందిన బీజేపీ నేత సూరజ్‌పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు యూపీలో ప్రచారం చేసి అలసిపోయిన ఓ కేబినెట్ మంత్రి కార్యకర్తలతో కాళ్లు పట్టించుకొని మరో వివాదానికి కారణమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.