యాప్నగరం

Kerala Landslide: కేరళ వరదలు.. భయపెడుతున్న కొండచరియలు

కన్నూర్ ప్రాంతంలోనూ కొండచరియలు భయం గొలుపుతున్నాయి. భారీ వరదలకు ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగెత్తుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

Samayam Telugu 16 Aug 2018, 5:15 pm
దక్షిణాది రాష్ట్రం కేరళపై వరుణుడు తన ప్రకోపాన్ని కొనసాగిస్తున్నాడు. ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో ఇప్పటివరకుూ 87 మంది మృతి చెందారు. రెండు రోజుల్లోనే 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వీరిలో కొండ చరియలు విరిగి పడటం వల్లే ఎక్కువ మంది మరణించారు. ఒక్క పాలక్కడ్‌ జిల్లాలోనే కొండచరియలు విరిగిపడి 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu slide


కన్నూర్ ప్రాంతంలోనూ కొండచరియలు భయం గొలుపుతున్నాయి. భారీ వరదలకు ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగెత్తుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలోని 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి హెచ్చరికలు) జారీ చేశారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు భారీగా చేరడతో వారం రోజుల వరకూ మూసేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మెట్రో, రైళ్ల సేవలను కూడా నిలిపేశారు. పలు నగరాలు, గ్రామాలను వరదనీరు ముంచెత్తడంతో జనావాసాలు ముంపులో చిక్కుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.