వంటలకు సంబంధించి యూట్యూబ్లో వందలాది ఛానెల్స్ ఉన్నాయి. కానీ, అందులో బాగా పాపులర్ అయింది కొన్ని మాత్రమే. తెలుగు ప్రజలకు ‘గ్రాండ్పా కిచెన్’ యూట్యూబ్ ఛానెల్ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. వంటల తాత నారాయణ రెడ్డి వండే విధానం, ఆయన వంటల తాలూకూ గుబాళింపు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. కానీ, ఆయన గతేడాది అక్టోబర్లో కన్నుమూశారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తమిళనాడులోనూ ఇలాగే ఓ తాత తన వంటలతో అద్భుతం చేస్తున్నారు. ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పేరుతో ఆయన మనవళ్లు ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా పాపులర్ అయింది. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ ఛానెల్ను ఇప్పటికే 7.11 మిలియన్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంతేకాదు, ఇటీవల తమిళనాడు పర్యటన నిమిత్తం వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ వంటల తాత టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చారు. సరదాగా వారితో కలిసి గరిటతిప్పారు. ఆ తర్వాత మష్రూమ్ బిర్యానీ ఆస్వాదించి తమిళంలో వారికి కితాబిచ్చారు.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. శుక్రవారం (జనవరి 29) పోస్టు చేసిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. వాళ్లు తయారు చేసిన బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సంభాషణ అదనపు ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, వారికి ఆయన అరుదైన అవకాశం కూడా కల్పించబోతుండటం విశేషం.
Must Read: గ్రాండ్పా కిచెన్ వంటల తాత ఇకలేరు.. కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో
ఏమిటీ విలేజ్ కుకింగ్ ఛానెల్?
అది తమిళనాడులోని పుడుక్కొట్టై జిల్లా ‘చిన్నవీరమంగళం’ గ్రామం. ఆ గ్రామానికి చెందిన పెరియతంబి వంటలు అద్భుతంగా చేస్తారు. పైగా సహజసిద్ధంగా, తేలిగ్గా తయారు చేస్తారు. వెరైటీ వెరైటీ వంటలను భారీ మొత్తంలో చేసి.. పిల్లలు, పేదలకు పెడతారు. అలా ఆనందం పొందుతారు. ఆ ప్రాంతంలో ఆయన వంటల తాతగా గుర్తింపు పొందారు.
పెరియతంబికి ఐదుగురు మనవళ్లు. వారిలో ఒక మనవడు సుబ్రమణ్యం ఎంఫిల్ చేశాడు. ఉన్నత చదువులు చదివిన అతడు తన తాత కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అలా వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానెల్ ఐడియా. తన సోదరులు మురుకేశన్, అయ్యనార్, తమిళ్సెల్వన్, ముత్తుమక్కమ్ను కన్వీన్స్ చేసి తన ఆలోచన చెప్పాడు. అందరూ ఓకే చెప్పడంతో దాన్ని ఆచరణలో పెట్టారు.
పల్లె వాతావరణంలో ప్రకృతి ఒడిలోనే వాళ్లు వంటలు చేస్తారు. వంటల కోసం ఉపయోగించే మసాలాలు తదితరాలను అప్పటికప్పుడే తాజాగా తయారు చేసుకుంటారు. సంప్రదాయ ఇసురు రాయిపై చక్కగా నూరుకుంటారు. వంటలకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చి కారం, మసాలా పొడులు.. అన్నింటినీ అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు.
వంట కోసం అవసరమైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అడవిలో చెట్ల మధ్యే కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తారు. ఇక వంట మొదలు పెడతారు. పెరియతంబి ఒక్కో ఐటెం పేరు చెబుతూ, చేసే విధానం చూపిస్తూ వంట కొనసాగిస్తారు.
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చేపల వంటకాలతో పాటు వెజ్, నాన్-వెజ్కు సంబంధించి వందలాది రకాల వంటలు చేశారు పెరియతంబీ అండ్ టీమ్. ఆ వీడియోలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనతి కాలంలోనే ఆ వంటల ఛానెల్.. ఊహించనివిధంగా పాపులర్ అయింది.
ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ బృందాన్ని కలిశారు. అప్పటికప్పుడు అక్కడికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. పెరియతంబీ బృందంతో పాటు వంటలో చేయి కలిపారు.
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఆహ్లాదకరమైన ప్రదేశంలో హాయిగా మాట్లాడుతూ బిర్యానీ ఆరగించారు. రాహుల్ చెప్పినట్లు ఆ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. గుబాళింపు కూడా అద్భుతంగా ఉందట. బిర్యానీ ఆరగించిన తర్వాత వారిని తమిళంలో ప్రశంసించారు. ఆ నాలుగు తమిళ మాటలు కూడా అప్పటికప్పుడు నేర్చుకున్నారు. ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది.
నవ్విస్తుంది.. భావోద్వేగానికి గురిచేస్తుంది!
స్థానిక మహిళ ఒకరు రాహుల్కు, పెరియతంబి టీమ్కు మధ్య ట్రాన్స్లేటర్గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది.
తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీతో సుబ్రమణ్యం చెప్పాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అది వన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా.
14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. చివరి నిమిషంలో వచ్చే దృశ్యాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి వారికి రుచికరమైన భోజనం వండి పెడుతున్న పెరియతంబి అండ్ టీమ్కు చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!
Also Read:
✦ ఈ పాప బతకాలంటే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి..
✦ ఆటో డ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్.. 20 లక్షల నగలు తిరిగిచ్చేశాడు
✦ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆ ఏజ్ గ్రూప్ వారికి ఇవ్వొద్దా.. మరి కొవిషీల్డ్ పరిస్థితి?
✦ హోటల్లో పెన్ డ్రైవ్.. ఓపెన్ చేస్తే బాయ్ఫ్రెండ్తో యువతి, బయటపెడతానని బెదిరించి!
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. శుక్రవారం (జనవరి 29) పోస్టు చేసిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. వాళ్లు తయారు చేసిన బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సంభాషణ అదనపు ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, వారికి ఆయన అరుదైన అవకాశం కూడా కల్పించబోతుండటం విశేషం.
Must Read: గ్రాండ్పా కిచెన్ వంటల తాత ఇకలేరు.. కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో
ఏమిటీ విలేజ్ కుకింగ్ ఛానెల్?
అది తమిళనాడులోని పుడుక్కొట్టై జిల్లా ‘చిన్నవీరమంగళం’ గ్రామం. ఆ గ్రామానికి చెందిన పెరియతంబి వంటలు అద్భుతంగా చేస్తారు. పైగా సహజసిద్ధంగా, తేలిగ్గా తయారు చేస్తారు. వెరైటీ వెరైటీ వంటలను భారీ మొత్తంలో చేసి.. పిల్లలు, పేదలకు పెడతారు. అలా ఆనందం పొందుతారు. ఆ ప్రాంతంలో ఆయన వంటల తాతగా గుర్తింపు పొందారు.
పెరియతంబికి ఐదుగురు మనవళ్లు. వారిలో ఒక మనవడు సుబ్రమణ్యం ఎంఫిల్ చేశాడు. ఉన్నత చదువులు చదివిన అతడు తన తాత కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అలా వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానెల్ ఐడియా. తన సోదరులు మురుకేశన్, అయ్యనార్, తమిళ్సెల్వన్, ముత్తుమక్కమ్ను కన్వీన్స్ చేసి తన ఆలోచన చెప్పాడు. అందరూ ఓకే చెప్పడంతో దాన్ని ఆచరణలో పెట్టారు.
పల్లె వాతావరణంలో ప్రకృతి ఒడిలోనే వాళ్లు వంటలు చేస్తారు. వంటల కోసం ఉపయోగించే మసాలాలు తదితరాలను అప్పటికప్పుడే తాజాగా తయారు చేసుకుంటారు. సంప్రదాయ ఇసురు రాయిపై చక్కగా నూరుకుంటారు. వంటలకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చి కారం, మసాలా పొడులు.. అన్నింటినీ అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు.
వంట కోసం అవసరమైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అడవిలో చెట్ల మధ్యే కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తారు. ఇక వంట మొదలు పెడతారు. పెరియతంబి ఒక్కో ఐటెం పేరు చెబుతూ, చేసే విధానం చూపిస్తూ వంట కొనసాగిస్తారు.
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, చేపల వంటకాలతో పాటు వెజ్, నాన్-వెజ్కు సంబంధించి వందలాది రకాల వంటలు చేశారు పెరియతంబీ అండ్ టీమ్. ఆ వీడియోలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనతి కాలంలోనే ఆ వంటల ఛానెల్.. ఊహించనివిధంగా పాపులర్ అయింది.
ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ బృందాన్ని కలిశారు. అప్పటికప్పుడు అక్కడికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. పెరియతంబీ బృందంతో పాటు వంటలో చేయి కలిపారు.
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఆహ్లాదకరమైన ప్రదేశంలో హాయిగా మాట్లాడుతూ బిర్యానీ ఆరగించారు. రాహుల్ చెప్పినట్లు ఆ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిస్తోంది. గుబాళింపు కూడా అద్భుతంగా ఉందట. బిర్యానీ ఆరగించిన తర్వాత వారిని తమిళంలో ప్రశంసించారు. ఆ నాలుగు తమిళ మాటలు కూడా అప్పటికప్పుడు నేర్చుకున్నారు. ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది.
నవ్విస్తుంది.. భావోద్వేగానికి గురిచేస్తుంది!
స్థానిక మహిళ ఒకరు రాహుల్కు, పెరియతంబి టీమ్కు మధ్య ట్రాన్స్లేటర్గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది.
తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీతో సుబ్రమణ్యం చెప్పాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అది వన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా.
14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. చివరి నిమిషంలో వచ్చే దృశ్యాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి వారికి రుచికరమైన భోజనం వండి పెడుతున్న పెరియతంబి అండ్ టీమ్కు చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!
Also Read:
✦ ఈ పాప బతకాలంటే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కావాలి..
✦ ఆటో డ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్.. 20 లక్షల నగలు తిరిగిచ్చేశాడు
✦ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆ ఏజ్ గ్రూప్ వారికి ఇవ్వొద్దా.. మరి కొవిషీల్డ్ పరిస్థితి?
✦ హోటల్లో పెన్ డ్రైవ్.. ఓపెన్ చేస్తే బాయ్ఫ్రెండ్తో యువతి, బయటపెడతానని బెదిరించి!