యాప్నగరం

కష్టపడ్డాం కాని ఓడాం..పోరు ఆగదు: రాహుల్

కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ట్వీట్ చేస్తూ ఫలితాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా... మీరు ఇచ్చిన మద్దతును అభినందిస్తున్నా... మీ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

Samayam Telugu 15 May 2018, 10:14 pm
కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ట్వీట్ చేస్తూ ఫలితాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా... మీరు ఇచ్చిన మద్దతును అభినందిస్తున్నా... మీ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు... ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంకితభావంతో... కష్టపడి పని చేశారంటూ ట్వీట్ చేశారు. ఉదయం నుంచి రాహుల్ గాంధీ ఫలితాలపై స్పందించకపోవడంపై బీజేపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. అయితే రాత్రికి కాని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేయలేదు.
Samayam Telugu Rahul Gandhi


ఈ ఎన్నికల కోసం రాహుల్ కూడా ముమ్మర ప్రచారం చేశారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కర్ణాటకలోనే బిజీ, బిజీగా గడిపారు. అయితే ఆ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో నిరాశే మిగిలింది. కాంగ్రెస్ కేవలం 78 స్థానాలకే పరిమితమయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.