ఆ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి
తాము నల్లధనం, అవనీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తమను వ్యతిరేకిస్తున్నాయని
TNN 16 Dec 2016, 11:43 am
తాము నల్లధనం, అవనీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తమను వ్యతిరేకిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
‘ఇంతకు ముందెన్నడు లేనివిధంగా నేడు అధికార పక్షం నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ప్రతిపక్షాలు పోరాడటం (అవినీతికి వ్యతిరేకంగా) లేదు. ఇంతకు ముందు అధికారపార్టీ బోఫోర్స్, స్పెక్ట్రమ్ వంటి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై దానిపై పోరాడాయి. కానీ, నేడు అధికారపక్షం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది’ అని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో అన్నారు.
బీజేపీ, ఎన్డీయేలకు పార్టీ కం దేశమే ముఖ్యమని, కానీ కాంగ్రెస్ కు మాత్రం దేశం కంటే పార్టీయే ముఖ్యమని ఆరోపించారు.
నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రమంత్రులు, ఎంపీలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రంతా కుంభకోణాల మయమేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల వల్లే పార్లమెంటులో చర్చలు జరగడం లేదని ఆయన విమర్శించారు.
‘ఇంతకు ముందెన్నడు లేనివిధంగా నేడు అధికార పక్షం నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ప్రతిపక్షాలు పోరాడటం (అవినీతికి వ్యతిరేకంగా) లేదు. ఇంతకు ముందు అధికారపార్టీ బోఫోర్స్, స్పెక్ట్రమ్ వంటి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై దానిపై పోరాడాయి. కానీ, నేడు అధికారపక్షం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది’ అని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో అన్నారు.
బీజేపీ, ఎన్డీయేలకు పార్టీ కం దేశమే ముఖ్యమని, కానీ కాంగ్రెస్ కు మాత్రం దేశం కంటే పార్టీయే ముఖ్యమని ఆరోపించారు.
నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రమంత్రులు, ఎంపీలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రంతా కుంభకోణాల మయమేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల వల్లే పార్లమెంటులో చర్చలు జరగడం లేదని ఆయన విమర్శించారు.