గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ప్రముఖ జ్యోతిర్లింగ ఆలయం సోమనాథ్ను దర్శించి, హిందువేతర రిజిస్టర్లో సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలపై రాహుల్ గాంధీ కూడా ఎదురుదాడి చేశారు. తన మతం గురించి ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. మా నాయనమ్మ, మా కుటుంబమంతా శివభక్తులమని, అలాంటి విషయాలు వ్యక్తిగతమైనవని, ఇవి బయటపెట్టకూడదని రాహుల్ అన్నారు. గురువారం అమ్రేలిలో వ్యాపారులతో సమావేశమైన రాహుల్ తనపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
దేవుడిపై విశ్వాసం అనేది వ్యక్తిగత విషయమని, దీని గురించి ఎవరికీ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము వ్యాపారం చేయాలనుకోవడంలేదని, మేము మతాలతో రాజకీయాలు చేసే మధ్యవర్తులం కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్తో కలిసి బుధవారం సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ హిందువేతరులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పేర్లను నమోదు చేసే రిజిస్టర్లో తాను కూడా సంతకం చేశారు. ఈ అంశం బీజేపీకి అస్త్రంగా దొరకడంతో రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఇది కేవలం బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధి రణదీప్ సూర్జావాలా ఆరోపించారు. అంతేకాదు రాహుల్ గాంధీ హిందూ బ్రాహ్మణుడని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మతమేంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ సమాధానం చెప్పాల్సిదేనని, ఆయన స్పష్టత ఇవ్వాలని అన్నారు. సోనియాతో వివాహానికి ముందు రాజీవ్ గాంధీ క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు 1998లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొందని, అలాగే తన పిల్లలను కూడా రోమన్ క్యాథిలిక్స్గా సోనియా గాంధీ పేర్కొన్నారని ఈ విషయాన్ని కూడా రాహుల్ ఖండించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
దేవుడిపై విశ్వాసం అనేది వ్యక్తిగత విషయమని, దీని గురించి ఎవరికీ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము వ్యాపారం చేయాలనుకోవడంలేదని, మేము మతాలతో రాజకీయాలు చేసే మధ్యవర్తులం కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్తో కలిసి బుధవారం సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ హిందువేతరులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పేర్లను నమోదు చేసే రిజిస్టర్లో తాను కూడా సంతకం చేశారు. ఈ అంశం బీజేపీకి అస్త్రంగా దొరకడంతో రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఇది కేవలం బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధి రణదీప్ సూర్జావాలా ఆరోపించారు. అంతేకాదు రాహుల్ గాంధీ హిందూ బ్రాహ్మణుడని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మతమేంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ సమాధానం చెప్పాల్సిదేనని, ఆయన స్పష్టత ఇవ్వాలని అన్నారు. సోనియాతో వివాహానికి ముందు రాజీవ్ గాంధీ క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు 1998లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొందని, అలాగే తన పిల్లలను కూడా రోమన్ క్యాథిలిక్స్గా సోనియా గాంధీ పేర్కొన్నారని ఈ విషయాన్ని కూడా రాహుల్ ఖండించలేదని ఆయన వ్యాఖ్యానించారు.