యాప్నగరం

2022లో మాదే పవర్: ఆఫీసులన్నీశుద్ధి చేయిస్తా

మొన్న జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సమాజ్ వాదీపార్టీ 2022లో అధికారంలోకి వస్తుందని

TNN 25 Mar 2017, 7:34 pm
మొన్న జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సమాజ్ వాదీపార్టీ 2022లో అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. ప్రస్తుత యూపీ సీఎం తన కంటే వయసులో యేడాది పెద్దవాడని.. అయితే.. పరిపాలనలో అనుభవం లేదని అన్నారు.
Samayam Telugu we will come to power in 2022 will purify all offices with gagajal
2022లో మాదే పవర్: ఆఫీసులన్నీశుద్ధి చేయిస్తా


అఖిలేష్ సీఎంగా కొనసాగినప్పుడు ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేశాక...కొత్త సీఎం యోగి అందులోకి వచ్చే ముందు వేద పండితులతో పూజలు చేయించడంపై అఖిలేష్ స్పందించారు.

‘‘ఆ ఇంట్లో (సీఎం అధికారిక నివాసం) ఏలాంటి పూజలు, శుద్ధి చేయించినా నాకు ఏలాంటి అభ్యంతరం లేదు కానీ రోజు ఆ ఇంట్లో వచ్చే నెమళ్లను బాగా చూసుకుంటే అదే చాలు. 2022లో మాదే అధికారం అప్పుడు.. గంగాజలంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుద్ధి చేయిస్తా’’ అని అఖిలేష్ అన్నారు.

సచివాలయంలో అధికారులతో ఆఫీసులు ఊడ్చేలా చేస్తున్నారని వ్యాఖ్యానించిన అఖిలేష్... తాను సీఎంగా ఉన్నప్పుడు అధికారులు ఊడ్చుతారు అని తెలిసి ఉంటే చాలా చీపుర్లు ఇచ్చి ఉండేవాడినని చమత్కరించారు.

2014 ఎన్నికల్లో అచ్చే దిన్ తెస్తామని మోదీ చెప్పారని..మూడేళ్ల గడిచినా ‘మంచిరోజుల’కు బదులుగా జనానికి చీపుర్లు ఇచ్చి వీధులు ఊడ్చండి అంటూ చెడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, శనివారం అఖిలేష్ నాయకత్వంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ములాయం సింగ్ యాదవ్ సహా ఆయన సోదరుడు, అఖిలేష్ బాబాయ్ శివ్ పాల్ యాదవ్ లు హాజరుకాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.