యాప్నగరం

దక్షిణేశ్వర్ స్కైవాక్.. మమత డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభం

దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కాళీ మాత ఆలయానికి చేరుకునేలా భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి దక్షిణేశ్వర్ స్కైవాక్‌గా నామకరణం చేశారు.

Samayam Telugu 5 Nov 2018, 10:36 pm
కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం ఎంతో ప్రసిద్ధి. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూ లల నుంచి ఎంతో మంది భక్తులు కోల్‌కతా వెళ్తుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి సంబరాలను కాళీమాత ఆలయంలో అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. ఏడాదిలో 1.4 కోట్ల మంది భక్తులు కాళీమాత ఆలయానికి వస్తున్నట్లు అంచనా. కోల్‌కతాకు ఉత్తరాన వివేకానంద బ్రిడ్జికి ఆనుకుని ఉన్న ఈ మందిరానికి రావాలంటే సమీపంలోని దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి కాలి నడకనే ఆలయానికి చేరుకోవాలి. అందుకనే భక్తుల సౌకర్యార్థం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అద్భుత ప్రాజెక్టును చేపట్టారు. అదే దక్షిణేశ్వర్ స్కైవాక్.
Samayam Telugu Skywalk1


దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కాళీ మాత ఆలయానికి చేరుకునేలా భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి దక్షిణేశ్వర్ స్కైవాక్‌గా నామకరణం చేశారు. ఈ స్కైవాక్‌ను సోమవారం మమతా బెనర్జీ ప్రారంభించారు. త్వరలోనే ఇది భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే కాదు.. దీనిలో షాపింగ్ కాంప్లెక్సులు కూడా ఉన్నాయి. మొత్తం 200 దుకాణాలు దీనిలో ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎస్కలేరట్లు, ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. ఎంతో అందంగా, అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్‌తో దీన్ని రూపొందించారు. ఈ స్కైవాక్ నిర్మాణానికి అయిన ఖర్చు సుమారు రూ.65 కోట్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.