యాప్నగరం

పశువధ నిషేధంపై ముదిరిన రగడ

పశువధపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

TNN 30 May 2017, 7:25 am
పశువధపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ రాష్ట్రాల్లో ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి తాము సిద్ధంగా లేమని ఖరాఖండిగ చెప్పారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని, దానిని ఆమోదించే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ చెప్పారు. దీన్ని రాజ్యాంగబద్ధంగా ఎదర్కొంటామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని మమత ప్రకటించారు. పశువధ నిషేధంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన కేరళ సీఎం విజయన్.. తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
Samayam Telugu west bengal kerala take bull by horn reject cattle trade ban
పశువధ నిషేధంపై ముదిరిన రగడ


రాష్ట్రాల అధికారాలను కేంద్రం తుంగలో తొక్కుతోందని విజయన్ విమర్శించారు. దేశ ప్రజలు ఏం తినాలో ఢిల్లీ, నాగ్‌పూర్ నిర్ణయించలేవని కేంద్ర ప్రభుత్వం, ఆరెస్సెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు కేరళ, తమిళనాడుల్లో నిరసనలు జోరందుకుంటున్నాయి. ఈ నెల 31న తమిళనాడులో భారీఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాలని ప్రతిపక్షపార్టీ డీఎంకే నిర్ణయించింది. అలాగే పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పశువధ నిషేధాన్ని అమలు చేయడానికి నిరాకరించింది. పశువధ నిషేధానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు పుదుచ్చేరి ప్రకటించింది.

కాగా, తమిళనాడులోని మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, హోసుర్ తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పశువంటకాల విందును ఏర్పాటుచేశారు. తీవ్ర నిరసనల నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లలో వధించకూడని జంతువుల జాబితా నుంచి గోవులకు మినహాయింపు ఇవ్వవచ్చని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.