యాప్నగరం

మహిళలకు మసీదు ప్రవేశం.. ప్రతి శుక్రవారం ప్రార్థనలు

పశ్చిమ బెంగాల్‌లో బుర్థ్వాన్ జిల్లాలో మసీదులో ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న మహిళలు. గతంలో తరహాలో కాకుండా ప్రస్తుతం చాలా మార్పులొచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పాత పద్ధతులు కొనసాగుతున్నాయి.

Samayam Telugu 20 Jan 2019, 10:59 pm

ప్రధానాంశాలు:

  • ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న మహిళలు
  • పాత సంప్రదాయాలను పక్కన పెట్టిన పెద్దలు
  • పెద్దల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న మహిళలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
కేరళలో ముగ్గురు మహిళలు మసీదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మహిళలను మసీదులోకి అనుమతిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి శుక్రవారం ముస్లింల మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి అంగీకారం తెలిపి వారికి సహకరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బుర్థ్వాన్ జిల్లాలో ఉన్న మసీదులోకి మహిళలు ప్రతి శుక్రవారం వస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. గతంలో ఈద్ సమయంలో మాత్రమే మసీదు ఆవరణలోకి మహిళల్ని అనుమతించారు. తర్వాత ప్రార్థనలకు అవకాశం కల్పించారు. మూడు అంతస్తుల మసీదులోని రెండో ఫ్లోర్‌లో మహిళలు ప్రార్థనలు నిర్వహిస్తారు. పురుషులు మూడో ఫ్లోర్.. యువత గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రార్థనలు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.