యాప్నగరం

Mocha Cyclone పెను తుఫానుగా ‘మోచా’.. 160 కి.మీ. వేగంతో గాలులు.. బెంగాల్‌ అలర్ట్

Mocha Cyclone బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారింది. దీనికి మోచా అనే పేరును అధికారులు సూచించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ దిశగా కదులుతోంది. తీవ్ర తుఫానుగా మారినట్టు హెచ్చరించిన ఐఎండీ... గాలి వేగం గంటకు 150 కి.మీ. ఉంటుందని తెలిపింది. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడింది. తుఫాను మే 12నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు కదిలింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 12 May 2023, 11:05 am

ప్రధానాంశాలు:

  • బంగాళాఖాతంలో తుఫానుగా మారిన అల్పపీడనం
  • బంగ్లాదేశ్-మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం
  • ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Cyclone
ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన మోచా తుఫాను పెను తుఫానుగా మారినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణించి.. ఆదివారం నాటికి తుఫానుగా బలహీనపడి తీరం దాటుతుందని తెలిపింది. ఆగ్నేయ బంగ్లాదేశ్- ఉత్తర మయన్మార్ సరిహద్దుల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యుక్‌ప్యు మధ్య మే 14 మధ్యాహ్న సమయంలో సిట్వేకి సమీపంలో తీరాన్ని తాకనుందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 150-160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
తీరంలో అలలు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల ఎత్తున ఎగిసిపడతాయని హెచ్చరికలు చేసింది. మత్స్యకారులు ఆదివారం వరకు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. ప్రకృతి వైపరీత్యాలను నిర్వహించడానికి అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. త్రిపుర, మిజోరాం శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మణిపూర్, దక్షిణ అసోంలోని పలుచోట్ల ఆదివారం మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

మోచా తుఫాను దృష్ట్యా పశ్చిమ్ బెంగాల్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన ఎనిమిది బృందాలను మోహరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కోస్ట్‌గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ సెకెండ్ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఎనిమిది బృందాలను, 200 మంది సిబ్బందిని మోహరించాం.. మరో 100 మందిని సిద్ధంగా ఉంచాం’ అని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు యెమెన్‌లోని ఓ చిన్న మత్స్యకార గ్రామం ‘మోచా’ పేరును సూచించారు. ఈ గ్రామం కాఫీ ఉత్పత్తికి గుర్తింపు పొందింది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.