యాప్నగరం

5 దాటితే అడుగు బయటపెట్టొద్దు.. బెంగాల్‌లో మరింత కఠినంగా లాక్‌డౌన్

కరోనా కట్టడి కోసం బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 9 నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

Samayam Telugu 7 Jul 2020, 10:48 pm
రోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 9 నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ ఆంక్షల పరిధిలోకి వైరస్ ప్రభావం ఉన్న మరిన్ని ప్రాంతాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. పక్కపక్కనే కంటైన్‌మెంట్ జోన్లు, బఫర్ జోన్లను కలిపి ‘విస్తృత కంటెయిన్‌మెంట్ జోన్’గా (Broad Based Containment Zone) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇలాంటి విస్తృత కంటెయిన్‌మెంట్ జోన్లలో సాయంత్రం 5 గంటల నుంచే పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Samayam Telugu బెంగాల్ లాక్‌డౌన్
Bengal Lockdown


విస్తృత కంటెయిన్‌మెంట్ జోన్లలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేసి ఉంచాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్, ఇండస్ట్రియల్ సంస్థలతో పాటు అత్యవసరంకాని ఇతర సంస్థలన్నింటినీ మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. నిత్యావసరాలను స్థానిక అధికారులే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నిబంధనలను ఎప్పటివరకు అమల్లో ఉంచుతారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఇప్పటికే జులై 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్యను 17 నుంచి 33కు పెంచారు.

Must Read:
గాల్లో ఢీకొన్న విమానాలు.. అమెరికాలో ఘోర ప్రమాదం

Also Read: కరోనా అని తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగింపు.. జర్నలిస్టు ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.