తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు దిశగా రాజ్భవన్ కార్యాలయంలో చర్యలు మొదలైనప్పటికీ... అక్కడి రాజకీయ పరిణామాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడటం లేదు. అందుకు కారణం ముఖ్యమంత్రిగా పళనిసామి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నప్పటికీ... ఆయన తనకున్న మద్దతుని నిరూపించుకోవడానికి మరో 15 రోజుల వ్యవధి వుండటమే.
ప్రస్తుతం పళనిసామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు వుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 117 మంది ఎమ్మెల్యేలు. ఈ రెండు సంఖ్యల మధ్య వున్న గ్యాప్ తక్కువే కావడంతో ఈ 15 రోజుల్లో ఏమైనా జరగవచ్చనే ఆందోళన పళనిసామి వర్గాన్ని వెంటాడుతోంది. తమకి కావాల్సిన దానికన్నా అధిక సంఖ్యలో ఎమమ్మెల్యేల మద్దతు వుందని పళనిసామి వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... లోలోపల ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూనే వున్నట్టుగా ఏఐఏడీఎంకే వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఒక విధంగా పన్నీర్సెల్వంకి కూడా తనకి వున్న ఎమ్మెల్యేల మద్దతుని ప్రదర్శించుకోవడానికి వున్న వ్యవధి ఈ 15 రోజులే. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పుడు పన్నీర్సెల్వం ముందున్న ఏకైక లక్ష్యం పళనిసామి వర్గీయులని తనవైపు రప్పించుకోవడమే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు కాకపోయినా... పళనిసామి వర్గంలోంచి 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలని తనవైపు తిప్పుకోగలిగితే చాలు. అప్పుడు పళనిసామి ప్రభుత్వం మెజార్టీని కోల్పోతుంది.
ఇదిలావుంటే, ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన పన్నీర్సెల్వం, పళనిసామి ఇద్దరూ తమకి రాజకీయ ప్రత్యర్థులే అని ప్రకటించిన డీఎంకే నేత స్టాలిన్ కూడా ఈ అవకాశాన్ని తమకి అనుకూలంగా మల్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సభలో ఏ పార్టీకి మెజార్టీ లేని పక్షంలో తిరిగి ఎన్నికలే అనివార్యం అవుతాయని భావిస్తున్న స్టాలిన్... మళ్లీ ఎన్నికలకి సిద్ధంగా వుండాల్సిందిగా మొదటినుంచి పార్టీ కార్యకర్తలకి సూచిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పళనిసామి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పన్నీర్సెల్వంకి అయినా స్టాలిన్కి అయినా కావాల్సింది పళనిసామి వర్గానికి చెందిన ఓ 10 మంది ఎమ్మెల్యే మద్దతు సరిపోతుంది. దీంతో ఇవాళ ప్రభుత్వం అయితే ఏర్పాటవుతున్నా.. ఈ 15 రోజుల్లో ఏమైనా జరగొచ్చనే టెన్షన్ మాత్రం అక్కడి రాజకీయ పార్టీలకే కాకుండా తమిళతంబీలని సైతం వేధిస్తోంది.
ప్రస్తుతం పళనిసామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు వుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 117 మంది ఎమ్మెల్యేలు. ఈ రెండు సంఖ్యల మధ్య వున్న గ్యాప్ తక్కువే కావడంతో ఈ 15 రోజుల్లో ఏమైనా జరగవచ్చనే ఆందోళన పళనిసామి వర్గాన్ని వెంటాడుతోంది. తమకి కావాల్సిన దానికన్నా అధిక సంఖ్యలో ఎమమ్మెల్యేల మద్దతు వుందని పళనిసామి వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... లోలోపల ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూనే వున్నట్టుగా ఏఐఏడీఎంకే వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఒక విధంగా పన్నీర్సెల్వంకి కూడా తనకి వున్న ఎమ్మెల్యేల మద్దతుని ప్రదర్శించుకోవడానికి వున్న వ్యవధి ఈ 15 రోజులే. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పుడు పన్నీర్సెల్వం ముందున్న ఏకైక లక్ష్యం పళనిసామి వర్గీయులని తనవైపు రప్పించుకోవడమే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు కాకపోయినా... పళనిసామి వర్గంలోంచి 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలని తనవైపు తిప్పుకోగలిగితే చాలు. అప్పుడు పళనిసామి ప్రభుత్వం మెజార్టీని కోల్పోతుంది.
ఇదిలావుంటే, ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన పన్నీర్సెల్వం, పళనిసామి ఇద్దరూ తమకి రాజకీయ ప్రత్యర్థులే అని ప్రకటించిన డీఎంకే నేత స్టాలిన్ కూడా ఈ అవకాశాన్ని తమకి అనుకూలంగా మల్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సభలో ఏ పార్టీకి మెజార్టీ లేని పక్షంలో తిరిగి ఎన్నికలే అనివార్యం అవుతాయని భావిస్తున్న స్టాలిన్... మళ్లీ ఎన్నికలకి సిద్ధంగా వుండాల్సిందిగా మొదటినుంచి పార్టీ కార్యకర్తలకి సూచిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పళనిసామి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పన్నీర్సెల్వంకి అయినా స్టాలిన్కి అయినా కావాల్సింది పళనిసామి వర్గానికి చెందిన ఓ 10 మంది ఎమ్మెల్యే మద్దతు సరిపోతుంది. దీంతో ఇవాళ ప్రభుత్వం అయితే ఏర్పాటవుతున్నా.. ఈ 15 రోజుల్లో ఏమైనా జరగొచ్చనే టెన్షన్ మాత్రం అక్కడి రాజకీయ పార్టీలకే కాకుండా తమిళతంబీలని సైతం వేధిస్తోంది.