యాప్నగరం

Indian Navy Day: మెరుపు దాడితో పాక్ వెన్నులో వణుకు పుట్టించిన భారత నేవీ

పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన కరాచీ రేవుపై భారత నాకాదళం డిసెంబర్ 4, 5 తేదీల్లో దాడి చేసింది. శత్రువు బలహీనతను ఉపయోగించుకొని రాత్రి పూట దాడి చేసిన నేవీ.. పాక్‌కు భారీ నష్టాన్ని చేకూర్చింది.

Samayam Telugu 4 Dec 2018, 1:34 pm
దేశానికి నౌకాదళం చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. భారత్, పాక్ యుద్ధం సందర్భంగా మన నౌకాదళం మెరుపు దాడితో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. భారత యుద్ధ నౌకలు 1971 డిసెంబర్ 4న కరాచీ హార్బర్‌పై దాడి చేశాయి పాక్‌ను దెబ్బతీశాయి. నాటి నుంచి డిసెంబర్ 4న నేవీ డే జరుపుకొంటున్నారు. భారత నేవీ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన నాలుగు నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఇంధన నిల్వ క్షేత్రాలు ధ్వంసం కావడంతోపాటు, 500 మందికిపైగా పాక్ నేవీ సిబ్బంది చనిపోయారు.
Samayam Telugu navy day


ఈ దాడిలో భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ వీర్ యుద్ధనౌకలు కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ ఆదేశాలతో.. 1971 డిసెంబర్ 4న గుజరాత్‌లోని ఒఖా పోర్టు నుంచి పాక్ సాగర జలాల దిశగా బయల్దేరిన ఈ నౌకలు.. కరాచీ పోర్ట్‌పై దాడికి దిగాయి. కరాచీ హార్బర్ దిశగా వస్తోన్న భారత నౌకలను గమనించిన పాక్ నేవీ తమ నౌకలను కూడా రంగంలోకి దింపింది. దీంతో మిస్సైల్‌తో దాడికి దిగిన ఐఎన్ఎస్ వీర్.. పాక్ యుద్ధనౌక ముహఫిజ్‌ను సముద్రంలో ముంచివేసింది. అందులో ఉన్న 222 మంది సిబ్బంది నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.