యాప్నగరం

ఆ ఐఏఎస్ పోస్టుమార్టం రిపోర్టు ఏం చెబుతోంది?

అతను సాధారణ వ్యక్తి కాదు... యువ ఐఏఎస్ అధికారి.

TNN 19 May 2017, 7:54 am
అతను సాధారణ వ్యక్తి కాదు... యువ ఐఏఎస్ అధికారి. అలాంటి వ్యక్తి అనాథలా రోడ్డు పక్కన విగత జీవిగా పడిఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నారో లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే చంపారో కూడా తెలియడం లేదు. లక్నోలో కర్ణాటక కేటర్ కు చెందిన అనురాగ్ తివారీ అనే ఐఏఎస్ అధికారి రెండు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మరణించాడు. దీనిపై ఉత్తరప్రదేశ్ లో సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అనురాగ్ పోస్టు మార్టం రిపోర్టు కూడా అతని మరణానికి కారణాలేంటో చెప్పలేకపోతోంది. పోలీసులు మాట్లాడుతూ ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించినట్టు పోస్టు మార్టంలో తెలుస్తోందని అన్నారు. మరింత క్షుణ్నంగా శవపంచనామా చేసేందుకు అనురాగ్ శరీరంలోని స్రావాలను, ప్రధాన అవయవాలను ల్యాబ్ కు పంపించారు. వైద్యనిపుణులు వాటిని పరిశీలించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు.
Samayam Telugu what says ias anurag tiwaris post mortem report
ఆ ఐఏఎస్ పోస్టుమార్టం రిపోర్టు ఏం చెబుతోంది?


అనురాగ్ కేసులో ఎన్నో ప్రశ్నలు సమాధానాల్లేకుండా మిగిలిపోయాయి. ఒక ఐఏఎస్ అర్థరాత్రి వేళలో ఒంటరిగా బయటకు ఎందుకు వెళతారు? పోనీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా అనుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి తన గదిలోనే చేసుకోవచ్చు... ఇలా రోడ్డు మీదకు వచ్చి చేయక్కర్లేదు. ఇదే విషయంపై కూడా యూపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.

యూపీ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా అసెంబ్లీలో మాట్లాడుతూ అనురాగ్ మృతి వెనుక కుట్రకోణం ఉండొచ్చని చెప్పారు. అతను కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో జరిగిన వేల కోట్ల రూపాయల స్కామ్ లను బయట పెట్టేందుకు సిద్ధపడ్డారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.