యాప్నగరం

‘సమయం విలువైంది.. సద్వినియోగం చేసుకోండి’

వ్యక్తి, సంస్థ, దేశ విజయంలో సమయ నిర్వహణ చాలా ముఖ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.

TNN 12 Aug 2017, 8:21 pm
వ్యక్తి, సంస్థ, దేశ విజయంలో సమయ నిర్వహణ చాలా ముఖ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. అధ్యక్ష హోదాలో శుక్రవారం (ఆగస్టు 11) ఆయన రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాలక్షేపానికి మనకు సమయం లేదు. ఈ సభ ఏడాదిలో 100 రోజులు సమావేశం అవుతోంది. సభ్యులంతా ఈ సమయాన్ని దేశ ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలి. అన్ని పార్టీల సభ్యులకూ సమయం లభించేలా చూస్తా. వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృథా చేసుకుంటే చిన్న పార్టీల సమయం హరించుకుపోతుంది’ అని వెంకయ్య అన్నారు.
Samayam Telugu what venkaiah tells on times importance in rajya sabha as vice president
‘సమయం విలువైంది.. సద్వినియోగం చేసుకోండి’


‘ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా మీరంతా నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తా’ అని వెంకయ్య పేర్కొన్నారు. మనకు అతిగొప్ప మేధోసంపత్తి, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వం ఉందని, దేశం తన శక్తి సామర్థ్యాలు, మానవ, సహజవనరుల బలాన్ని గుర్తించి ముందడుగు వేయాలని ఆయన సూచించారు.

‘చట్టసభ సభ్యుడిగా నేను గ్రంథాలయానికి వెళ్లి గొప్ప నాయకుల ప్రసంగాలను పరిశీలించేవాణ్ని. అదే నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీం ఇండియా’లా పనిచేయాలన్న ప్రధాని పిలుపు సంతోషకరం. కేవలం కేంద్ర రాష్ట్రాలే కాకుండా స్థానిక ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేయాలి. వాటికి నిధులు, విధులు బదలాయించాలి’ అని వెంకయ్య పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.