యాప్నగరం

మాధురీ దీక్షిత్‌తో మాటల్లో పెట్టించి.. వాజ్‌పేయిని బురిడీ కొట్టించారు

సినీ నటి మాధురీ దీక్షిత్‌ను నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పరిచయం చేసిన అధికారులు.. వారిద్దరూ మాట్లాడుతుండగా.. అటల్‌జీని బురిడీ కొట్టించారు.

Samayam Telugu 17 Aug 2018, 8:04 am
నవ భారత భీష్ముడిగా పేరొందిన వాజ్‌పేయి గురువారం సాయంత్రం కన్నుమూశారు. విలువలకు మారుపేరుగా నిలిచిన అటల్ జీ అనంత లోకాలకు తరలివెళ్లారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ఏడురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. వాజ్‌పేయి కేవలం రాజకీయ నాయకుడే మంచి కవి, చేయి తిరిగిన పాక శాస్త్ర ప్రావీణ్యుడు కూడా. ఆయన మంచి భోజన ప్రియుడు. జర్నలిస్టుల కోసం ఆయన స్వయంగా వండి వడ్డించిన సందర్భాలూ ఉన్నాయి.
Samayam Telugu vajpayee madhuri


జన్మతః బ్రాహ్మణుడైనా.. వాజ్‌పేయి శాకాహారంతోపాటు మాంసాహారాన్ని కూడా ఇష్టంగా తినేవారు. స్వీట్లంటే ఆయనకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ వస్తే బిర్యానీ, లక్నోలో గలోటీ కబాబ్... ఇలా ఏ ప్రాంతానికి వెళ్తే.. అక్కడి ప్రత్యేక వంటకాలు రుచి చూసేవారు. ఆయన రొయ్యలను ఇష్టంగా తినేవారు. దీంతో వెంకయ్య నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రొయ్యలను తీసుకెళ్లేవారు.

అటల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓసారి అధికారిక విందు ఇచ్చారు. ఆ విందులో ఆయనకు ఇష్టమైన గులాబ్‌ జామ్‌లను ఉంచారు. అప్పటికే డయాబెటిస్ రావడంతో ఆయన వాటిని తినకూడదు. దీంతో సహాయకులు ఓ స్కెచ్ వేశారు. నటి మాధురీ దీక్షిత్‌ను ఆయనకు పరిచయం చేశారు. వారిద్దరూ సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అదే అదనుగా అక్కడి నుంచి గులాబ్ జామ్‌లను తీసేశారు. అలా మాధురీతో మాటల్లో ఉంచి.. ఆయన దృష్టిని మరల్చిన విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.