యాప్నగరం

మధ్యలోనే రైలు దిగిపోయిన శివసేన ఎంపీ?

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై దాదాపు అన్ని విమాన సంస్థలు నిషేదం విదించాయి.

Samayam Telugu 26 Mar 2017, 2:05 pm
ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై దాదాపు అన్ని విమాన సంస్థలు నిషేదం విదించాయి. ఏ విమానంలో ఎక్కకుండా ఆయనపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ముంబైకి రైలులో ప్రయాణించారు. అయితే తమ గమ్యస్థానమైన సొంత నియోజకవర్గం ఉస్మానబాద్ కు చేరుకోలేదని సమాచారం. తాను ప్రయాణిస్తున్న ఆగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు గుజరాత్ లోని వాపి స్టేషన్ చేరుకోగానే ఆయన దిగిపోయినట్లు తెలిసింది.
Samayam Telugu where is ravindra gaikwad shiv sena mp leaves train midway
మధ్యలోనే రైలు దిగిపోయిన శివసేన ఎంపీ?


అక్కడి నుంచి గైక్వాడ్ ఎటు వెళ్లారో ఏలాంటి సమాచారం లేదు. రైలు షెడ్యూలు ప్రకారం శనివారం రాత్రి 9గంటలకు ఉస్మానబాద్ లోని ఉమగ్రా చేరుకుంది. అందులో రవీంద్ర వస్తున్నారని తెలిసిన ఆయన అనుచరులు, మీడియా ప్రతినిథులు స్టేషన్ కు చేరుకున్నారు. కానీ రవీంద్ర మధ్యలో దిగిపోయారని తెలిసి వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్ (60)ను చెప్పుతో కొట్టిన రవీంద్ర క్షమాపణలు చెప్పడానికి ససేమిరా అనడంతో ఆయనపై ఢిల్లీలో హత్యా ప్రయత్నం సెక్షన్ కింద రెండు కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.