యాప్నగరం

జాతీయగీతాలాపన..ఫోన్లో ఎమ్మెల్యే ముచ్చట్లు

జాతీయగీతాలాపన సమయంలో ఓ ఎమ్మెల్యే సెల్ ఫోన్ ముచ్చట్లలో మునిగిపోయారు.

Samayam Telugu 19 Dec 2016, 10:52 am
జాతీయగీతాలాపన సమయంలో ఓ ఎమ్మెల్యే సెల్ ఫోన్ ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సంఘటన ఆదివారం కలకత్తాలోని ఓ స్టేడియంలో జరుగుతున్న ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో చోటు చేసుకుంది.
Samayam Telugu while national anthem plays wb mla speaks over phone
జాతీయగీతాలాపన..ఫోన్లో ఎమ్మెల్యే ముచ్చట్లు


ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపించారు. టోర్నమెంట్ ప్రారంభానికి హాజరైన క్రీడాకారులు, అధికారులు, కోచ్ లు జాతీయ గీతాలాప చేస్తే వారితోపాటే ఉన్న బాలీ అసెంబ్లీ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా మాత్రం సెల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించారు.

కేవలం 52 సెకన్ల పాటు ఉండే జాతీయ గీతాలాపన సమయంలో కూడా ఓపిక లేకుండా...ప్రజాప్రతినిధులు ఇలా చేయడమేంటనీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించారని వైశాలిపై మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.