యాప్నగరం

తమిళనాడు కొత్త గవర్నర్ ఎవరు?

తమిళ గవర్నర్ రేసులోఆనందిబెన్ పటేల్, నజ్మాహెప్తుల్లా ఉన్నట్టు తెలుస్తోంది.

TNN 15 Oct 2016, 1:10 pm
తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసింది. ఆయన పదవీకాలాన్నే పెంచుతారని చాలా మంది భావించారు. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును ఇన్‌ఛార్జిగా నియమించింది. సెప్టెంబరులోనే ఆయన ఛార్జ్ తీసుకున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్ 22 నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంకా దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇన్‌ఛార్జి గవర్నర్ పూర్తి స్థాయి బాధ్యతలు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. అది వీలుకాకపోవచ్చు. అందుకే పాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాలని కేంద్రం భావిస్తోంది.
Samayam Telugu who will be the next governor of tamilanadu
తమిళనాడు కొత్త గవర్నర్ ఎవరు?


తమిళ గవర్నర్ రేసులో గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లా ఉన్నట్టు తెలుస్తోంది. నజ్మా హెప్తుల్లాను కొన్ని రోజుల క్రితమే మణిపూర్ గవర్నర్ గా నియమించారు. ఆమెను అక్కడి నుంచి తమిళనాడుకు బదిలీ చేస్తారా లేక ఆనంది బెన్ ను నియమిస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.