యాప్నగరం

పౌరసత్వ బిల్లు: ముస్లింలు, శ్రీలంక తమిళులను చేర్చకపోవడానికి కారణమిదే!

పౌరసత్వ సవరణ బిల్లులో ముస్లింలను చేర్చకపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపిస్తున్నాయి. ముస్లింలు, శ్రీలంక తమిళులను ఈ బిల్లు పరిధిలోకి ఎందుకు తేలేదో బీజేపీ ఎంపీలు వివరణ ఇచ్చారు.

Samayam Telugu 11 Dec 2019, 9:14 pm
పౌరసత్వ సవరణ బిల్లు-2019పై రాజ్య సభలో ఆమోద ముద్ర పడింది. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. రాత్రి 8 గంటల వరకు చర్చ జరిగింది. ఈ బిల్లుకు సోమవారం రాత్రి లోక్ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పౌరసత్వ బిల్లుపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
Samayam Telugu పౌరసత్వ బిల్లు
రాజ్యసభలో మాట్లాడుతున్న అమిత్ షా


ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు తరహాలోనే ఈ బిల్లు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా తెలిపారు. పౌరసత్వ బిల్లు గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాకిస్థాన్‌లో ముస్లింలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని హోం మంత్రి తెలిపారు. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో ముస్లింలు మైనార్టీలు కాదు కాబట్టి వారిని దీని పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదన్నారు.

రోహింగ్యాలు మయన్మార్‌లోకి శరణార్థులుగా వచ్చి.. అక్కడి నుంచి భారత్‌కు అక్రమంగా వలస వచ్చారని.. అందుకే వారిని ఈ బిల్లు పరిధిలోకి తీసుకురాలేదన్నారు. దేశ విభజనకు జిన్నా డిమాండే కారణమని అందరికీ తెలుసన్న అమిత్ షా.. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టడానికి కాంగ్రెస్ ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు.

Read Also: గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చీట్.. తప్పంతా వాళ్లదేనట

పౌరసత్వ సవరణ బిల్లులో శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదనే విషయమై ఎంపీ సుబ్రమణ్య స్వామి వివరణ ఇచ్చారు. మత ప్రతిపాదిక శరణార్థులుగా వారు భారత్ రాలేదని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి యుద్ధం కారణంగా వారు మన దేశానికి వచ్చారన్న ఆయన.. తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో ఇక్కడ వాళ్ల జనాభా తగ్గిందన్నారు. సామూహిక హత్యాకాండ అనేది ఎల్టీటీఈ ప్రచారమని ఆయన తెలిపారు. 8-9 లక్షల మంది శ్రీలంక తమిళులకు గతంలో భారత పౌరసత్వం ఇచ్చామని అమిత్ షా తెలిపారు.

Read Also: పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.