యాప్నగరం

రాజ్యాంగ దినోత్సవం ఎలా మొదలైంది? ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి..?

Indian Constitution | భారత రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Samayam Telugu 25 Nov 2019, 10:36 pm
మన దేశంలో ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. తర్వాత 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌గానూ పిలుస్తారు. సోమవారం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తవుతుంది. ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నవంబర్ 19, 2015న భారత ప్రభుత్వం ప్రకటించింది.
Samayam Telugu భారత రాజ్యాంగం


ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 2015లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవం పబ్లిక్ హాలిడే కాదు. కానీ ప్రభుత్వం విభాగాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ ఏడాది తొలిసారిగా జమ్మూ కశ్మీర్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. కొద్ది కాలం క్రితం వరకు ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్లో అమల్లో ఉంది. దీని ప్రకారం 1957 నుంచి ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉంది. ఆర్టికల్‌ 370ను ఇటీవలే కేంద్రం రద్దు చేయడంతో.. జమ్మూ కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమైంది.

Read Also: మిత్రపక్షాల ‘మహా’బల ప్రదర్శన.. బీజేపీకి చెక్?

సంవిధాన్ దివస్ సందర్భంగా.. జమ్మూ కశ్మీర్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉదయం 11 గంటలకు ప్రతిజ్ఞ చేయడంతోపాటు రాజ్యాంగ పీఠికను చదువుతారని జమ్మూ కశ్మీర్ సాధారణ పరిపాలన విభాగం అదనపు కార్యదర్శి సుభాష్ చిబ్బెర్ తెలిపారు.

Read Also: అమరావతి నిర్మాణాలకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.