అమర జవాన్లకు సంబంధించిన వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. దేశరక్షణ విధుల్లో అమరులైన వారి సతీమణుల బాధ వర్ణనాతీతం. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ.. పిల్లలకు ధైర్యం చెబుతూ గుండె దిటవు చేసుకుని చివరి వీడ్కోలు పలుకుతారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన ఎన్కౌంటర్లో అమరుడైన వీర జవాన్ విభూతి కుమార్ దౌండియాల్కు ఆయన భార్య ఇచ్చిన చివరి వీడ్కోలు అందరి హృదయాలను కలచివేస్తోంది. తన భర్తకు చివరిసారిగా ఆమె ఐ లవ్ యూ చెప్పిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మరణించగా.. వారిలో మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ ఒకరు. దౌండియాల్ భౌతికకాయానికి ఉత్తరాంఖండ్లోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
తన భర్త విభూతిని విగతజీవిగా చూసిన భార్య నికితా బోరున విలపించారు. ఆ తర్వాత దు:ఖాన్ని దిగమింగుకుని అమర్ హై, జైహింద్ అంటూ ఘనంగా నివాళి అర్పించారు. తన భర్తను ప్రేమగా.. విభూ అని పిలుచుకునే నికితా.. దౌండియాల్ భౌతికకాయం పక్కన కూర్చుని భర్తతో చివరిసారిగా ‘ఐ లవ్ యూ విభూ.. వియ్ లవ్ యూ’ అని చెప్పారు. చివరిసారిగా ముద్దు ఇచ్చారు.
దేశ రక్షణ కోసం తన భర్త చేసిన త్యాగం తనకు గర్వకారణమని నికిత అన్నారు. దౌండియాల్, నికిత వివాహం గతేడాది ఏప్రిల్లోనే జరిగింది. తొలి మ్యారేజ్ యాన్నివర్సరీ జరుపుకోడానికి ఇంటికి వస్తానని అతడు నికితకు మాటిచ్చి మరీ కశ్మీర్ వెళ్లాడు. ఇప్పుడిలా విగత జీవిగా రావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తన భర్త విభూతిని విగతజీవిగా చూసిన భార్య నికితా బోరున విలపించారు. ఆ తర్వాత దు:ఖాన్ని దిగమింగుకుని అమర్ హై, జైహింద్ అంటూ ఘనంగా నివాళి అర్పించారు. తన భర్తను ప్రేమగా.. విభూ అని పిలుచుకునే నికితా.. దౌండియాల్ భౌతికకాయం పక్కన కూర్చుని భర్తతో చివరిసారిగా ‘ఐ లవ్ యూ విభూ.. వియ్ లవ్ యూ’ అని చెప్పారు. చివరిసారిగా ముద్దు ఇచ్చారు.
దేశ రక్షణ కోసం తన భర్త చేసిన త్యాగం తనకు గర్వకారణమని నికిత అన్నారు. దౌండియాల్, నికిత వివాహం గతేడాది ఏప్రిల్లోనే జరిగింది. తొలి మ్యారేజ్ యాన్నివర్సరీ జరుపుకోడానికి ఇంటికి వస్తానని అతడు నికితకు మాటిచ్చి మరీ కశ్మీర్ వెళ్లాడు. ఇప్పుడిలా విగత జీవిగా రావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.