యాప్నగరం

Hunger Strike: చట్టాన్ని అడ్డుపెట్టుకుని భార్యలు వేధిస్తున్నారు.. నిరాహార దీక్షకు దిగిన భార్యా బాధితులు

ప్రస్తుత కాలంలో కేవలం మహిళలు మాత్రమే గృహ హింస బాధితులనుకోవడం పొరపాటు. మగవాళ్లు కూడా ఈ హింసను ఎదుర్కొంటున్నట్టు ఇటీవల పలు సర్వేలు, నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహ హింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహ హింస కిందకే వస్తుంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 26 Feb 2023, 11:49 am

ప్రధానాంశాలు:

  • పురుషులపైనే కూడా సాగుతున్న గృహ హింస
  • బెంగళూరులో భార్య బాధితులు ఆందోళన
  • చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bengaluru Protest
భర్తలు మాత్రమేకాకుండా ఇతర కుటుంబ సభ్యులను హింస నుంచి కూడా మహిళలకు మద్దతుగా, రక్షణగా ఉండే విధంగా చర్యలు తీసుకోనే అవకాశం కల్పిస్తోంది గృహహింస చట్టం (Domestic Violence Act). ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, తాము వేధింపులకు గురవుతున్నామని వాపోతున్నారు భార్యా బాధితులు (Wife Victims). ఈ లోసుగులను అడ్డుపెట్టుకుని కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ చట్టాన్ని సవరించాలనే డిమాండ్‌తో భార్యా బాధితుల సంఘం నిరాహార దీక్షను (Hunger Strike) చేపట్టింది. రెండు రోజుల నిరాహార దీక్షను బెంగళూరులో శనివారం ప్రారంభించారు.
‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌’ (Save Indian Family Foundation) తో కలిసి భార్యా బాధితుల సంఘం ప్రతినిధులు శనివారం బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆ సంఘం సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫువారిని వేధిస్తున్నారని సంఘ సభ్యులు వాపోయారు. ఎన్‌ఆర్‌ఐల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.

గృహహింస కేసులో గతేడాది మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)పురుషులు కూడా హింసకు గురవుతారా? అనే ప్రశ్నను లేవనెత్తింది. దీనికి ఉదాహరణగా హరియాణాలోని హిసార్‌కు చెందిన ఒక వ్యక్తి కేసును ప్రస్తావించింది. భార్య చిత్రహింసలు కారణంగా 21 కిలోల బరువు తగ్గడంతో దీని ఆధారంగా హైకోర్టులో కేసు దాఖలు చేసి విడాకులకు ఆమోదం పొందాడు. ఇలాంటి కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. పురు షులపై హింస జరుగుతుందని చాలామంది అనుకోవడం కూడా నమ్మశక్యం కాదు.

కానీ, కుటుంబ వివాదాలను పరిష్కరించే కౌన్సెలింగ్‌ కేంద్రాల గణాంకాలు సైతం పురుషులు కూడా మహిళల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారనడానికి నిదర్శనం. గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో 40 శాతం పురుషుల నుంచి వచ్చినవే. విడాకులు మాత్రమే మహిళలకు ఏకైక ఎంపిక అని కూడా తెరపైకి వచ్చింది. అయితే పురుషులు కౌన్సెలింగ్‌కి ప్రాధాన్యతనిస్తారు. అంటే, కౌన్సెలింగ్‌ ద్వారా లేదాఏవిధంగానైనా పురుషులు సంబం ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.

నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం.. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు కుటుంబంలో విభేదాలు, సంబంధాల దెబ్బతినడం తలెత్తే డిప్రెషన్‌. అదే సమయంలో, 2019 సంవత్సరంలో ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌’ పరిశోధన ప్రకారం.. హరియాణా గ్రామీణ ప్రాంతాల్లో 21-49 ఏళ్ల వయస్సున్న 1000 మంది వివాహిత పురుషులలో 52.4 శాతం మంది లింగ ఆధారిత హింసను అనుభవించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.