యాప్నగరం

అయోధ్య వివాద పరిష్కారం కోసం ముసాయిదా: వక్ఫ్ బోర్డ్

అయోధ్య వివాదాన్ని డిసెంబర్ 6లోగా శాంతియుతంగా పరిష్కరించడం కోసం ఓ ముసాయిదా ప్రతిపాదనను రూపొందిస్తామని ప్రకటించింది.

TNN 7 Nov 2017, 4:26 pm
అయోధ్య వివాద పరిష్కారం విషయమై ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 6లోగా ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడం కోసం ఓ ముసాయిదా ప్రతిపాదనను రూపొందిస్తామని ప్రకటించింది. 1992లో బాబ్రీ మసీద్‌ను కూలగొట్టిన రోజు సమస్యకు పరిష్కార దిశగా అడుగులేస్తామని తెలిపింది. ఈ విషయమై మంతనాలు జరపడానికి ఈ నెలలో అయోధ్య వెళ్లనున్నట్లు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వసీం రిజ్వీ తెలిపారు. ఈ విషయమై నిబంధనల గురించి ఇప్పటికే చాలా మందితో మాట్లాడానని ఆయన చెప్పారు.
Samayam Telugu will prepare draft proposal to settle ayodhya dispute by december 6 up shia waqf board
అయోధ్య వివాద పరిష్కారం కోసం ముసాయిదా: వక్ఫ్ బోర్డ్


పరస్పర అంగీకారం కోసం ఓ ముసాయిదా ప్రతిపాదనను డిసెంబర్ 6లోగా రూపొందిస్తామనే ఆశాభావాన్ని రిజ్వీ వ్యక్తం చేశారు. ఆయన గత నెలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవి శంకర్‌ను బెంగళూరులో కలిశారు. బాబ్రీ మసీద్‌ను కూల్చి వేసిన చోట రామ మందిరం కట్టే విషయంలో వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు. కాగా రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంపై తుది విచారణ డిసెంబర్ 5న సుప్రీంకోర్టులో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది దీపావళిలోగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి గతంలో వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.