ఈ రోజుల్లో ప్రతి సేవకు ఆధార్ను లింక్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆధార్ ఆధారంగా పలు పథకాలను అమలు చేస్తోంది. నకిలీల ఏరివేతకు ఇది సహకరిస్తోంది. అయితే, ఆధార్లో తలెత్తే లోపాల వల్ల కొంతమంది ప్రభుత్వ ప్రయోజనాలు సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆధార్ గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే గురువారం యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్పై కోర్టులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆధార్ ప్రత్యేకతలను, వాటి భద్రతా సామర్థ్యాల గురించి వివరించారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు ఈ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆధార్ డేటాను 2048 బిట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్లో భద్రపరిచామని తెలిపారు. దీని పరిధి విశ్వం వయస్సు కంటే పెద్దదని, దీన్ని హ్యక్ చేయాలంటే దాదాపు 13 బిలియన్ ఏళ్ల సమయం పడుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థలో వినియోగించే సాధారణ ఎన్క్రిప్షన్ కీ కంటే ఇది ఎనిమిది రెట్లు బలోపేతమైనదన్నారు.
అనుమతి లేకుండా ఆధార్ డేటా షేర్ చేయలేమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి తప్పనిసరని వివరించారు. అయితే, 49 మంది ఎన్రోల్మెంట్ ఆపరేటర్ల లైసెన్సులు ఎందుకు రద్దు చేశారని జస్టిస్ సిక్రి అడిగిన ప్రశ్నకు పాండే సమాధానం ఇస్తూ.. యూఐడీఏఐకి ఉన్న కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలే ఇందుకు కారణమని తెలిపారు.
ఆధార్ బయోమెట్రిక్ వివరాలు విఫలమైతే.. వారికి అందాల్సిన ప్రయోజనాలు నిలిపివేయడం న్యాయమేనా అని ధర్మసనం ప్రశ్నించింది. ఇందుకు ఆయన బదులిస్తూ.. ఆ వివరాలు విఫలమైతే ప్రయోజనాలు ఆపకూడదని ఆదేశించామని, ఇందుకు ప్రత్యామ్నయంగా వన్టైమ్ పాస్వర్డ్, డెమోగ్రాఫిక్ అథెంటికేషన్ వంటివి ప్రవేశపెట్టామని వెల్లడించారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు ఈ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆధార్ డేటాను 2048 బిట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్లో భద్రపరిచామని తెలిపారు. దీని పరిధి విశ్వం వయస్సు కంటే పెద్దదని, దీన్ని హ్యక్ చేయాలంటే దాదాపు 13 బిలియన్ ఏళ్ల సమయం పడుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థలో వినియోగించే సాధారణ ఎన్క్రిప్షన్ కీ కంటే ఇది ఎనిమిది రెట్లు బలోపేతమైనదన్నారు.
అనుమతి లేకుండా ఆధార్ డేటా షేర్ చేయలేమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి తప్పనిసరని వివరించారు. అయితే, 49 మంది ఎన్రోల్మెంట్ ఆపరేటర్ల లైసెన్సులు ఎందుకు రద్దు చేశారని జస్టిస్ సిక్రి అడిగిన ప్రశ్నకు పాండే సమాధానం ఇస్తూ.. యూఐడీఏఐకి ఉన్న కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలే ఇందుకు కారణమని తెలిపారు.
ఆధార్ బయోమెట్రిక్ వివరాలు విఫలమైతే.. వారికి అందాల్సిన ప్రయోజనాలు నిలిపివేయడం న్యాయమేనా అని ధర్మసనం ప్రశ్నించింది. ఇందుకు ఆయన బదులిస్తూ.. ఆ వివరాలు విఫలమైతే ప్రయోజనాలు ఆపకూడదని ఆదేశించామని, ఇందుకు ప్రత్యామ్నయంగా వన్టైమ్ పాస్వర్డ్, డెమోగ్రాఫిక్ అథెంటికేషన్ వంటివి ప్రవేశపెట్టామని వెల్లడించారు.