యాప్నగరం

అసలు మోదీ పార్లమెంటుకు వస్తారా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతిపక్షాల డిమాండ్ ఒక్కటే.. ప్రధాన మంత్రి సభకు హాజరుకావాలి, పెద్ద నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలి.

TNN 29 Nov 2016, 12:51 pm
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతిపక్షాల డిమాండ్ ఒక్కటే.. ప్రధాన మంత్రి సభకు హాజరుకావాలి, పెద్ద నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలి. మంగళవారం కూడా ఉభయ సభలు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో అనేక సార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు చైర్మన్ పోడియం ముందు నిలబడి ప్రధాని మోదీ సభకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. సభను సజావుగా జరగడానికి సహకరించాలని డిప్యూటీ చైర్మన్ ఎంత చెప్పినా ప్రతిపక్ష ఎంపీలు వినలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను కురియన్ వాయిదా వేశారు.
Samayam Telugu winter session of parliament opposition mps demand of pm modi in house
అసలు మోదీ పార్లమెంటుకు వస్తారా?


మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. ప్రధాని సభకు రావాలని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అయినా ఎంపీల నినాదాలు ఆగలేదు. దీంతో లోక్‌సభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

ప్రతిపక్షాలు ఇంతలా డిమాండ్ చేస్తున్నా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మాత్రం పార్లమెంట్‌కు రావడం లేదు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. మోదీ సభకు హాజరవుతారని, పెద్ద నోట్లపై సమాధానం చెప్తారని అన్నారు. కానీ ఎప్పుడు హాజరవుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మరి 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమైనా ఇదే అంశం ఎంపీలు డిమాండ్ చేయడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.