యాప్నగరం

ఎట్టకేలకు ట్రూడోకు మోదీ స్వాగతం.. అది కూడా ఎలా అంటే?

ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటనపై నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి ఐదు రోజుల కిందట భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

TNN 23 Feb 2018, 10:15 am
ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటనపై నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి ఐదు రోజుల కిందట భారత పర్యటనకు వచ్చిన ట్రూడోకు తొలిసారిగా ప్రధాని ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. విదేశీనేతల పర్యటన సమయంలో ప్రొటోకాల్‌ను సైతం పక్కనబెట్టి, వారికి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికే మోదీ, కెనడా ప్రధానిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. వారం రోజుల పర్యటనకు వచ్చిన ట్రూడో, నేడు మోదీతో భేటీకానున్నారు. గత శనివారం భారత్ చేరుకున్న ఆయన గుజరాత్, పంజాబ్, యూపీల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
Samayam Telugu with a tweet pm modi sets tone for his meeting with justin trudeau
ఎట్టకేలకు ట్రూడోకు మోదీ స్వాగతం.. అది కూడా ఎలా అంటే?


ఖలిస్థాన్ వేర్పాటువాదులకు అనుకూలంగా ట్రూడో గతంలో చేసిన వ్యాఖ్యలు, కెనడాలోని గురుద్వారాల్లోకి భారత్ దౌత్యాధికారులను అనుమతించకపోవడం లాంటి చర్యలతో భారత్ ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు ఖలిస్థాన్ తీవ్రవాది జస్పాల్ అత్వాల్‌ను గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన విందుకు ఆహ్వనిస్తూ ముద్రించిన ఆహ్వానపత్రికపై కూడా పెనుదుమారమే రేగింది. ట్రూడో భార్య సోఫియా అత్వాల్‌తో ఫోటో దిగడం కూడా విమర్శలకు తావిచ్చింది.

I hope PM @JustinTrudeau and his family had a very enjoyable stay so far. I particularly look forward to meeting his children Xavier, Ella-Grace, and Hadrien. Here is a picture from my 2015 Canada visit, when I'd met PM Trudeau and Ella-Grace. pic.twitter.com/Ox0M8EL46x — Narendra Modi (@narendramodi) February 22, 2018 మరోవైపు ట్రూడో పర్యటనపై మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ‘జస్టిన్ ట్రూడో కుటుంబం ఇప్పటివరకూ ఇండియాలో ఆనందంగా గడిపిందని భావిస్తున్నాను... వారి పిల్లలు జేవియర్, ఎల్లా గ్రేస్‌లను కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఉన్నాను. 2015లో కెనడా పర్యటనకు వెళ్లినప్పటి ఫోటో ఇది... అప్పట్లో నేను ట్రూడోతో పాటు ఎల్లా గ్రేస్‌లను కలిశాను’అని మోదీ ట్వీట్ చేశారు. రెండేళ్ల క్రితం వారితో దిగిన ఫోటోను మోదీ పోస్టు చేశారు. నేటి సమావేశంలో ఇరుదేశాధి నేతల మధ్య రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, వాతావరణ మార్పులు, విద్య తదితర రంగాల్లో సహాయ సహకారాలపై చర్చ సాగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.