యాప్నగరం

కుప్పకూలిన భవనం.. నలుగురు చిన్నారులు, మహిళ మృతి

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మరణించారు.

Samayam Telugu 26 Sep 2018, 2:00 pm
మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. శిథిలాల కింద 15 మందికి పైగా చిక్కుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్ సవాన్ పార్క్ ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 26) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఢిల్లీ అగ్నిమాపక సేవల విభాగం అధికారులతో కలిసి సహాయక చర్యలను చేపట్టారు.
Samayam Telugu collapse


శిథిలాల కింది నుంచి 14 మందిని రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్‌ చెందిన రెండు బృందాలు పాల్గొన్నాయి.

మరణించిన మహిళను మున్నీగా గుర్తించారు. చిన్నారుల్లో ఇద్దరు 9, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు సోదరులు, అయిదేళ్ల బాలిక, నాలుగేళ్లో బాలుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.